పెద్ద వయ్యస్సు వాళ్లు తినే ఆహారం, వాళ్లజ్ఞాపక శక్తి, వాళ్ల గుండె పనితీరు, షుగర్ స్థాయి వంటి అంశాల్నికొన్ని పరిశోధనలలో పరిశీలించగా… ఆశ్చర్యకర విషయాలు బయట పడ్డాయి. ఆహారం లో ప్రోటీన్ఎక్కువగా ఉన్నఆహార పదార్ధాల తో పాటు ఆహార ధాన్యాలు, తృణధాన్యాలు వంటివి ఎక్కువగాతీసుకునేవారికి జ్ఞాపక శక్తి బాగా ఉన్నట్లు గుర్తించారు.
ఇలాంటి ఆహారం తీసుకున్న వాళ్లు ముసలివాళ్లైనప్పటికీ కూడా వాళ్ల గుండె ఆరోగ్యవంతంగా ఉంటోంది అని పరిశోధకు లు తెలిపారు. వయసు పెరిగే గొద్దీ ఎక్కువ ఆరోగ్యవంతమైన ఆహారం తీసుకోవడం చాల అవసరమని చెబుతున్నారు.ఆస్ట్రేలియాలో చాలా మంది డైమెన్షియా సమస్య తో మరణిస్తున్నారు…. ఈ వ్యాధి ప్రారంభ దశ లో జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది. డైమెన్షియా వచ్చిన వారు ఏ విషయాన్ని సరిగా గుర్తుంచుకోలేరు. ఏ అంశంపైనా సరిగా నిర్ణయం తీసుకోలేరు.
సరిగా చదవలేరు, సరిగా ఆలోచించలేరు. మాట్లాడేటప్పుడు ఏదేదో మాట్లాడేస్తుంటారు. దేనిపైనా పూర్తిగా దృష్టి కేంద్రీకరించలేరు. ఒకటి అనుకొని మరొకటి చేస్తారు. ఆ తర్వాత ఇదేంటి ఇలా చేశాను అనుకుంటారు. రోజురోజుకూ ఈ సమస్య ఎక్కువై,ఏదో ఒక రోజు ఏదో చేసుకోబోయి, ఏ సూసైడో చేసేసుకుంటారు. లేదంటే… వేర్వేరు రకాలుగా ప్రాణాలు పోగొట్టుకుంటూ ఉంటారు.ఇలా డైమెన్షియా వచ్చిన వారు 2 నుంచీ 8 రకాలమెదడకు సంబందించిన సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు.
ఇక దురదృష్టం ఏమిటంటే డైమెన్షియా ఉండేవారికి, షుగర్, గుండె జబ్బులు,హైపర్టెన్షన్ వంటివి ఎక్కువగా ఉంటాయి.అసలీ సమస్యలేవీ రాకుండా ఉండాలంటే రోజువారీ అన్నం, గోధుమలు వంటివి తీసుకుంటూనే కూరగాయలు, ఆకు కూరలు, పండ్లు, కాయల్ని ఎక్కువగా తినాలంటున్నారు పరిశోధకులు. వీటిలో సహజ సిద్ధం గా మన శరీర మెటబాలిజంను సెట్ చేసే శక్తి ఉంటుందట.
సీజన్ వారీగా లభించే పండ్లను తినడం వల్ల… సీజనల్ వ్యాధుల్ని ఎదుర్కోవడమే కాకుండా శరీరం లో చెడు కొలెస్ట్రాల్ను తగ్గించుకోవచ్చని సూచిస్తున్నారు. అలాగే… ప్రోటీన్స్ ఉండే ఆహారం కూడా క్రమం తప్పకుండా తీసుకోవాలట. వయసులో ఉన్నప్పటి నుంచే ఇలాంటి ఆహార నియమాలుపెట్టుకుంటే పెద్దవయ్యస్సు కు వచ్చాక మతిమరపు, షుగర్ వంటివి ఇబ్బంది పెట్టకుండా ఉంటాయంటున్నారు.