ప్రస్తుతం మానవాళి పాలిట శాపంగా మారిన కరోనా వైరస్ ఇప్పుడు తన కోరలని భారతదేశంలో విస్తరించి కాటేస్తున్న వైనం మనం చూస్తూనే ఉన్నాం. వరుసగా రెండవ రోజు కూడా దేశంలో అత్యధిక కేసులు నమోదు కాగా గత 24 గంటల్లో దగ్గర దగ్గర పది వేల కేసులు భారతదేశంలో నమోదు కావడం గమనార్హం.
ఇదిలా ఉండగా ఇప్పుడు తెలుగు రాష్ట్రానికి చెందిన ప్రముఖ మీడియా సంస్థ టివి5 కి చెందిన ఒక జర్నలిస్టు కరోనా కారణంగా మృతి చెందాడు .. నుమోనియా తో పాటు కోవిడ్ కారణంగా టివి5 క్రైమ్ రిపోర్టర్ గా పని చేస్తున్న మనోజ్ అనే స్టింగర్ చనిపోయాడు అని తెలిసింది. అయితే అతను కరోనా కారణంగా ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతూ మరణించాడా లేదక అతనను అకస్మాత్తుగా మరణించిన తర్వాత నిర్ధారణలో కరోనా వల్ల ప్రాణాలు వదిలాడా…. అన్న విషయంపై ఇంకా క్లారిటీ లేదు.
ఒక్కసారిగా అతను అకస్మాత్తుగా చనిపోయిన తర్వాత అతను కరోనా వల్లే ప్రాణాలు కోల్పోయాడని నిర్ధారించినట్లు అయితే చాలా పెద్ద ప్రమాదం మీడియా వారికి పొంచి ఉంది అనే చెప్పాలి.
మీడియా ప్రతినిధులు నిరంతరం జనాల్లో తిరగడం, కోవిడ్ పేషెంట్ లని కలవడం లాంటివి జరగడం వల్లే ఇది జరిగింది అని అంటున్నారు.