ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ట్విట్టర్ యాజమాన్యానికి షాక్ ఇచ్చారు. ట్విట్టర్ కొనుగోలు ఒప్పందం నుండి తప్పుకున్నారు. విలీన ఒప్పందంలోని నిబంధనలను ట్విట్టర్ యాజమాన్యం ఉల్లంఘించినందున 44 బిలియన్ డాలర్ల ఒప్పందం నుండి తప్పుకున్నట్లు ఎలాన్ మస్క్ ప్రకటించారు. ట్విట్టర్ యాజమాన్యం తమ నివేదికలో పేర్కొన్నట్లుగా అయిదు శాతం కంటే తక్కువ గానే స్పామ్ అకౌంట్ లు ఉన్నట్లు గాఆధారాలు చూపించాల్సిందేనని గత కొంత కాలంగా ఎలాన్ మస్క్ డిమాండ్ చేస్తున్నారు. దీనిపై ట్విట్టర్ యాజమాన్యం స్పష్టత ఇచ్చే వరకూ ఒప్పంద ప్రక్రియ ముందుకు కదలదు అని పలు మార్లు స్పష్టం చేశారు. ఇప్పుడు ఏకంగా ఒప్పందాన్ని రద్దు చేసుకున్నట్లుగా ప్రకటించడంతో అందరూ ఆశ్చర్యానికి గురైయ్యారు.
అయితే మస్క్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని ట్విట్టర్ యాజమాన్యం తీవ్రంగా తీసుకుంది. మస్క్ పై చట్టపరమైన చర్యలకు సిద్ధమవుతోంది. మస్క్ తో అంగీకరించిన దర. నిబంధనల లావాదేవీలను కొనసాగించేందుకు ట్విట్టర్ బోర్డు కట్టుబడి ఉందని పేర్కొన్న ట్విట్టర్ చైర్మన్ బ్రెట్ టేలర్.. విలీన ఒప్పందాన్ని అమలు చేయడానికి చట్టపరమైన చర్యలు కొనసాగించాలని యోచిస్తున్నట్లు ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.
ఇది కూడా చదవండి: అమరనాథ్ గుహ వద్ద వరద భీభత్సం .. 15 మంది మృతి.. 40 మంది గల్లంతు