శ్రీనగర్ : జమ్ముకాశ్మీర్లోని హంద్వారా ఏరియాలో గత మూడు రోజులుగా భద్రతాదళాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. తాజాగా హంద్వారా ఏరియా బాబాగుండ్ ప్రాంతంలో ఆదివారం భద్రతాదళాలు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన కాల్పుల్లో ఇద్దరు టెర్రరిస్టులు హతమయ్యారు.
ఈ కాల్పుల్లో రెండు ఇళ్లు, రెండు గోశాలలు ధ్వంసయ్యాయి.
గత మూడు రోజులుగా జరుగుతున్న ఎదురుకాల్పుల్లో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతి చెందిన వారిలో ముగ్గురు సిఆర్పిఎఫ్ జవాన్లు, ఇద్దరు రాష్ట్ర పోలీసులు ఉన్నారు.