దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రస్థాయిలో ఉన్నప్పటికీ మనం లాక్ డౌన్ సిరీస్ ను వదిలేసి అన్ లాక్ సిరీస్ లోకి ఎంటర్ అయ్యాం. అన్ లాక్ 1 జూన్ 30తో ముగియడంతో వెంటనే అన్ లాక్ – 2 మార్గదర్శకాలు జారీ అయ్యాయి. కేంద్ర ప్రభుత్వం వన్ నిర్దేశించిన వాటికి రాష్ట్ర ప్రభుత్వాలు కొద్దిగా మార్పులు చేర్పులు చేసి తమ కొత్త ఆదేశాలను జారీ చేశారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అన్ లాక్ – 2 ను అమలు చేస్తూ కొత్త ఆదేశాలు జారీ చేసింది. ఇక అన్ లాక్ – 2 జూలై 1 నుండి 31 వరకు అమలులో ఉంటుంది. దీని మార్గదర్శకాలను ఇప్పటికే కేంద్ర హోం శాఖ ప్రకటించగా ఈ అన్ లాక్ సిరీస్ లో రెండో అంకాన్ని ఈ రాష్ట్రంలో అమలు చేస్తూ ఏపీ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం –
స్కూళ్లు, కాలేజీలు, కోచింగ్ సెంటర్లు ఈ నెల ఆఖరి వరకూ మూసే ఉంటాయి.
సినిమా హాల్స్, జిమ్ లు, స్విమ్మింగ్ పూల్స్, ఎంటర్టైన్మెంట్ పార్కులు మూసి వేయాల్సిందే.
బార్లు మరియు సమావేశ మందిరాలు ఎట్టిపరిస్థితుల్లో తెరవకూడదు
సామాజిక, రాజకీయ, క్రీడా, వినోద, విద్య, సాంస్కృతిక, ఆధ్యాత్మిక వేడుకల పై నిషేధం కొనసాగిస్తున్నారు.
వివాహ వేడుకలు మరియు చనిపోయిన వారి కార్యక్రమాలకు ఆయా జిల్లా కలెక్టరేట్ లు పాల్గొనే సభ్యుల వాటిల్లో సంఖ్యను నిర్దేశిస్తారు.
ఇక దేశీయ, అంతర్జాతీయ విమానాలు మరియు రైళ్ల పరిస్థితిని, బస్సుల రాకపోకలను పరిస్థితిని బట్టి వాటి సర్వీసులను పెంచే అవకాశం కానీ తగ్గించే అవకాశం కానీ ఉంటుంది.
కంటెంట్మెంట్ జోన్స్ లో పరిస్థితిని బట్టి ఆయా జిల్లా కలెక్టరేట్ లో సబ్ కలెక్టర్ నిత్యావసర వస్తువుల పై మరియు ఇతర వ్యాపార వ్యవహారాల పై ఆంక్షలు మరియు పరిమితులు విధించవచ్చు.