Vijay Sai Reddy : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల యుద్ధ వాతావరణాన్ని తలపిస్తున్న సంగతి తెలిసిందే. గత సార్వత్రిక ఎన్నికల కంటే ఎక్కువ రాజకీయ వేడి రాజుకుంటోంది. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తో మరోపక్క టిడిపి పార్టీ నేతలతో వైసిపి పార్టీ పెద్దలు నువ్వా నేనా అన్నట్టు గా వ్యవహరిస్తూ వస్తున్నారు. ఇదిలావుంటే ఇటీవల ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చం నాయుడు సొంత నియోజకవర్గంలో ఏకగ్రీవాలు అవ్వకుండా అచ్చెన్నాయుడు అనుచరులు వ్యవహరించిన తీరు ఏపీ రాజకీయాల్లో సంచలనం అయిన సంగతి తెలిసిందే.
అచ్చం నాయుడు బంధువులు వైసిపి పార్టీకి చెందిన వ్యక్తిని నామినేషన్ వెయ్యకుండా.. అచ్చెన్నాయుడు అనుచరులు అడ్డుకున్నట్లు పోలీసులపై కూడా దాడులకు దిగినట్లు నిన్న వార్తలు రావడం జరిగాయి. ఈ నేపథ్యంలో ఈ ఘటనపై వైసీపీ పార్టీ కీలక నేత ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ ద్వారా అచ్చం నాయుడు పై అదే విధంగా చంద్రబాబు పై భారీ డైలాగులు వేశారు. విజయసాయిరెడ్డి Vijay Sai Reddy ట్విట్టర్లో ఏమన్నారంటే… “ఏంటి అచ్చెన్నా…నిమ్మాడ అంటే చంద్రబాబు రాసిచ్చిన దివాణమా? మీరు డిక్టేట్ చేసిన వ్యక్తి తప్ప ఇంకొకరు సర్పంచ్ గా నామినేషన్ వేయకూడదా? అందరికీ శకునం చెప్పే బల్లి కుడితిలో పడ్డట్టు లేదూ!” అంటూ విజయసాయిరెడ్డి ఎటకారం అయినా సెటైర్లు వేస్తూ మండిపడ్డారు. ఇదే తరుణంలో అంతకు ముందు ట్వీట్లో “ప్రజా మద్దతుతో 4 సీట్లు కూడా గెలవలేమని పచ్చ పార్టీ ఫిక్సయింది. అందుకే నిమ్మగడ్డ యాప్. ఎలక్షన్ కమిషన్ యాప్ ఉండగా ఈ సీక్రెట్ యాప్ ఏంటి? దీని కంట్రోల్ రూం టీడీపీ ఆఫీసులో పెట్టారా? చంద్రబాబును, చినబాబును నువ్వు జాకీలేసినా లేపలేవు నిమ్మగడ్డా?” అంటూ విజయసాయిరెడ్డి స్పెషల్ గా పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో నిమ్మగడ్డ ఆధ్వర్యంలో వచ్చిన సరికొత్త యాప్ పై సెటైర్లు వేశారు.