Corona Vaccine : అగ్రరాజ్యం అమెరికా తర్వాత ప్రపంచంలోనే కోవిడ్ వైరస్ వల్ల భారీగా నష్టపోయిన దేశం భారత దేశమే. అయితే జనవరి 16వ తేదీన మొదలైన వాక్సినేషన్ నిర్విరామంగా జరుగుతున్న నేపథ్యంలో ఇక ఈ కరోనా వైరస్ ఆటలు సాగవు అని అందరూ భావించారు. అయితే వ్యాక్సినేషన్ మొదలైంది అన్న ఆనందం ఎంతో సేపు నిలవలేదు. ఇప్పటికే వ్యాక్సిన్ తీసుకున్న చాలామంది ఫ్రంట్ లైన్ వారియర్స్ లో సైడ్ ఎఫెక్ట్స్ రావడం మొదలయ్యాయి. కొంతమంది హాస్పిటల్ పాలయ్యారు కూడా.
ఇక అంతే కాకుండా రెండు రాష్ట్రాల్లోనే పలుచోట్ల మరణాలు సంభవించడం గమనార్హం. అయితే వ్యాక్సినేషన్ జరిగిన తర్వాత వారు చనిపోతే దానికి…. వ్యాక్సిన్ కు ఎలాంటి సంబంధం లేదు అని వైద్య నిపుణులు చెబుతున్నారు. సహజ మరణాలు వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత సంభంవించినంత మాత్రాన అది వ్యాక్సిన్ వల్ల మరణించినట్లు కాదని…. అసలు వ్యాక్సిన్ వల్ల మరణం సంభవించే అవకాశం లేదని తేల్చి చెప్పారు.
ఈ వ్యాక్సిన్ సురక్షితమా కాదా అని అందరూ డైలమాలో ఉన్నాప్పుడు తాజాగా మరో షాక్ తగిలింది. కర్ణాటకలో ఐదుగురు డాక్టర్లకు కరోనా వ్యాక్సిన్ వేసుకున్న వారం తర్వాత కూడా కోవిడ్ సోకడం గమనార్హం. కర్ణాటకలోని చమరజనగర్ జిల్లాలో ఐదుగురు డాక్టర్లకి గతవారం కరోనా టీకా వేశారు. అయితే ఒక వారం తర్వాత వారికి లక్షణాలు కనబడినప్పుడు టెస్ట్ చేస్తే పాజిటివ్ అని వచ్చింది.
ఇక ఆ జిల్లా మెడికల్ ఆఫీసర్ మాట్లాడుతూ కోవిడ్ టీకా రెండవ డోసు వేసుకున్న తర్వాతే అది పూర్తి స్థాయిలో పనిచేస్తుందని…. మొదటి డోసు వేసుకున్న తర్వాత కూడా ఫేస్ మాస్క్ పెట్టుకోవడం, భౌతిక దూరం పాటించడం వంటివి కచ్చితంగా ఫాలో కావాలని సూచించారు.