అడవి శేష్ హీరోగా శశికిరణ్ దర్శకత్వంలో వచ్చిన “మేజర్” సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. దేశభక్తి నేపథ్యంలో తెరకెక్కిన “మేజర్” సినిమా చాలామందిని ఆకట్టుకుంది. సామాన్యులు మొదలుకొని సెలబ్రిటీల వరకు “మేజర్” చూసి చాలా భావోద్వేగానికి గురయ్యారు. ముఖ్యంగా లాస్ట్ అరగంట సినిమా.. చాలామంది కంట నీరు పెట్టేటట్లు ఉంటది. ఈ క్రమంలో నిర్మాత మహేష్ బాబు కూడా సినిమా విడుదల అవ్వకముందు.. స్పెషల్ ప్రీమియర్ షో చూసిన టైములో కన్నీళ్లు పెట్టుకున్నారు. ముంబాయి 26/11 నేపథ్యంలో తెరకెక్కిన “మేజర్” … భారీ హిట్ అయింది. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన… ఈ చిత్రం చూసి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సినిమా యూనిట్ తో పాటు మేజర్ సందీప్ కుటుంబ సభ్యులను సత్కరించారు.
“మేజర్” మూవీపై మాజీ ఇండియన్ క్రికెటర్ పొగడ్తల వర్షం..!!
ఇదంతా పక్కన పెడితే తాజాగా సీనియర్ నటి తెలంగాణ బిజెపి నాయకురాలు విజయశాంతి “మేజర్” సినిమా యూనిట్ పై పొగడ్తల వర్షం కురిపించారు. మేజర్ సినిమాని చాలా గొప్పగా చూపించారు. అడివి శేష్.. శశికిరణ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో సైనికుల బాధ్యతలను అద్భుతంగా తెరకెక్కించారు. ఈ మధ్య కొంచెం సమయ విరామ అవకాశంలో చూసిన చిత్రాలలో మానవ సంబంధాల విలువని, సమాజంపై ఉండవలసిన వివేచనాత్మక వ్యక్తిత్వ తీరును, మనుషుల మధ్య ఉండవలసిన మానవతా ధోరణిని, భావోద్వేగాలను ఒక చిత్రం… మేజర్ అని కొనియాడారు.
దేశం పట్ల సైనికులకు ఉండే బాధ్యతను, సైన్యంలో చేరే పౌరులకు ఉండే జాతీయభావాల నిస్వార్థపూరిత స్ఫూర్తిని స్పష్టంగా చెప్పగలిగిన… చెప్పిన సినిమా మరో చిత్రం అనిపించాయి. మంచి ప్రయోజనాన్ని, ప్రజా శ్రేయస్సుని, అంకితభావంతో నిజాయితీగా ప్రేక్షకులను ముందుకు తీసుకుని వెళ్లే ప్రయత్నాలు ఎప్పుడైనా అభినందనీయమే… అంటూ తనదైన శైలిలో విజయశాంతి పొగడ్తల వర్షం కురిపించారు. విజయశాంతి పెట్టిన పోస్ట్ పట్ల అడవి శేశ్ రియాక్ట్ అవుతూ సంతోషం తెలిపి ఈ క్లాసికల్ సినిమాలకు నేను పెద్ద అభిమానిని అని రిప్లై ఇచ్చారు.