సాధారణంగా ఎన్నికల్లో విజయం సాధించిన నేతలకు సత్కారాలు అందుకుంటారు. ఓడిపోయిన వారు ఎన్నికల్లో పెట్టిన ఖర్చును తలుచుకుంటూ కొద్ది రోజులు బాధపడతారు. ఓటమికి కారణమైన ప్రజలపై కొద్ది రోజులుగా ముభావంగా ఉంటారు. కానీ రీసెంట్ గా జరిగిన ఓ ఘటన దేశ వ్యాప్తంగా ఆసక్తిని కల్గించింది. పరాజయం పాలైన సర్పంచ్ అభ్యర్ధికి గ్రామస్తులు రూ.11 లక్షల నగదు, ఓ కారు, భూమి బహుమతిగా ఇవ్వడం హాట్ టాపిక్ అయ్యింది.
TRS Vs BJP: బాబును చూసి నేర్చుకోలేదా..!? కేసిఆర్ దగ్గర కౌంటర్ ప్లాన్ లేదా..!?
విషయంలోకి వెళితే.. హర్యానాలో ఇటీవల పంచాయతీ ఎన్నికలు జరిగాయి. ఫతేహాబాద్ లోని నధోడి గ్రామంలో సుందర్, నరేందర్ అనే అభ్యర్ధుల మధ్య పోటీ నువ్వా నేనా అన్న రీతిలో జరిగింది. ఎన్నికల్లో మొత్తం 4,416 ఓట్లు పోల్ కాగా సుందర్ కు 2,200 ఓట్లు, నరేందర్ కు 2,201 ఓట్లు వచ్చాయి. ఒక్క ఓటు తేడాతో సుందర్ ఓటమి పాలైయ్యారు. అయితే ఓడిపోయిన అభ్యర్ధి బాధపడకూడదని గ్రామస్తులు అనుకున్నారో ఏమో కానీ ఓడిపోయిన, గెలిచిన అభ్యర్ధులకు సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా ఓడిపోయిన సుందర్ కు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారు గ్రామస్తులు. రూ.11లక్షల 11వేల నగదు, ఓ సిఫ్ట్ డిజైర్ కారు. కొంత భూమిని సుందర్ కు బహుమతిగా ఇచ్చారు. ఇదే క్రమంలో గెలిచిన అభ్యర్ధి నరేందర్ కు రూ.11లక్షల విలువైన రూ.500 నోట్లతో గజమాల తయారు చేసి దానితో ఆయనను సత్కరించారు. దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. గ్రామస్తుల చర్యను నెటిజన్ లు అభినందిస్తున్నారు.
Janasena BJP: బుర్ర లేనిది ఎవరికో.. పజిల్ మాటలు ఎందుకో..? ఎవరి వాగుడు వాళ్లదే..