తమిళనాడులో తుత్తకూడిలో ఒ భయానక రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళుతున్న ట్రక్కు నుండి వేలాడుతున్న తాడు.. బైక్ పై వెళుతున్న యువకుడి మెడకు చుట్టుకుంది. దీంతో అతను అమాంతం గాల్లోకి ఎగిరి రోడ్డు మీద పడ్డాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. బైక్ పై నుండి పడిపోయిన యువకుడు శ్రీవైకుంఠం ప్రాంతానికి చెందిన ముత్తు గా గుర్తించారు. అతను బైక్ నుండి కింద పడగానే సమీపంలోని వారు అతని వద్దకు వెళ్లి సాయం అందించారు.
అయితే అదృష్టవశాత్తు ఆ యువకుడు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఆ సమయంలో తలకు గాయం అయితే ప్రాణపాయం అయ్యేదని, చాలా అదృష్టంగా భావిస్తున్నారు. ఈ ప్రమదానికి ట్రక్ డ్రైవర్ నిర్లక్ష్యమే కారణంగా పేర్కొంటున్నారు. లోడ్ పై నుండి తాడు వేలాడుతున్నా దాన్ని పట్టించుకోకుండా డ్రైవర్ అలానే వేగంగా వాహనాన్ని నడుపుకుండూ వెళ్లడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని అంటున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
చూశారుగా ఈ వీడియో .. వాహనచోదకులు జర జాగ్రత్త.. పక్కగా వెళుతున్న వాహనాలను జర గమనించండి. లేకపోతే ఇటువంటి ప్రమాదాల బారిన పడగలరు. ద్విచక్ర వాహన చోదకులు రోడ్డుకు ఒక పక్కగా వెళుతున్నా జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ ఘటనతో అర్ధం అవుతోంది.
லாரியில் இருந்து விழுந்த பாசக்கயிறு.. கழுத்தில் மாட்டி தூக்கி வீசப்பட்ட வாலிபர்!!#thoothukudi #accident pic.twitter.com/6MRkUjlFHA
— A1 (@Rukmang30340218) December 15, 2022