కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలు అన్నిటినీ వణుకుపుటించిన మహమ్మారి. ఈ మహమ్మారి వల్ల ప్రజలు ఆరోగ్యపరంగా ఎన్నో సమస్యల్ని చవిచూశారు. కరోనా బారినపడి కొందరు మరణిస్తే, మరికొందరు తాము ఎదురుకుంటున్న వ్యాధులకు సరియైన చికిత్స లేక మరణించారు. ఇదిలా ఉండగా కోవిడ్-19 మొదలయినా దగ్గర నుండి స్వీయ నిర్బంధం చేసుకొని ఇంట్లోనే ఉండడం, సూర్యరశ్మి శరీరానికి తగలకపోవడం కారణంగా విటమిన్ లోపంతో ప్రజలు ఇబ్బందులు ఎదురుకుంటున్నారు.
విటమిన్-డి లోపం లేదా హైపోవినోమినియోసిస -డి ప్రస్తుతం వినిపిస్తున ఆరోగ్య సమస్య ఇది. విటమిన్-డి సాధారణంగా తక్కువ సూర్యరశ్మి కలిగిన ప్రత్యేకమైన సూర్యకాంతిలో తగిన అతినీలలోహిత కిరణాల నుండి లభిస్తుంది, కానీ కరోనా కారణంగా స్వీయ నిర్బంధంలో ఉండడం వల్లనా ఈ సూర్యరశ్మిని చూడలేకపోతునారు. విటమిన్-డి అనేది కాల్షియం మరియు ఫాస్ఫేట్ యొక్క ప్రేగు శోషణను మెరుగుపర్చడంలో సహాయపడే కొవ్వు-కరిగే సెసోస్టెరాయిడ్స్ యొక్క సమూహం. ఈ విటమిన్ సూర్యకాంతికి గురైనప్పుడు మన శరీరం తయారు చేసుకుంటుంది. విటమిన్-డి కలిగిన పోషకాహార తీసుకోకపోవడం వలన ఈ లోపంకి కారణమవుతుంది. ఇది మనుషుల శరీరానికి, ఆరోగ్యానికి చాలా అవసరం. కండరాలు, ఎముకలు ప్రతి ఒక్క భాగం ఆరోగ్యంగా ఉండాలంటే విటమిన్-డి తప్పనిసరి. విటమిన్-డి లోపిస్తే మధుమేహం, గుండె సంబంధ వ్యాధులకు గురయ్యే ప్రమాదముంది. క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. విటమిన్-డి లోపం వల్ల ఎముక ఖనిజీకరణ తగ్గిపోతుంది, పిల్లల్లో మచ్చలు వంటి ఎముక మృదువైన వ్యాధులకు దారితీస్తుంది. ఇది పెద్దలలో ఎముక పొలుసుల మరియు ఎముకల వ్యాధిని మరింత తీవ్రతరం చేస్తుంది, ఇది ఎముక పగుళ్ల ప్రమాదాన్ని పెంచుతుంది. కండరాల బలహీనత కూడా విటమిన్-డి లోపం వలన కలిగే సాధారణ లక్షణంగా చెప్పవచ్చు, ఇది పెద్దవారిలో ఎక్కువగా కనిపిస్తుంది.
‘సూర్యరశ్మి విటమిన్’ పొందలేకపోతున్నందున సాధారణ జనాభాలో విటమిన్ డి లోపం పెరుగుతున్నకేసులపై ఆరోగ్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. వాస్తవానికి, విటమిన్ డి లోపంతో బాధపడుతున్న 80% మంది కోవిడ్-19 రోగులు అని కొత్త అధ్యయనం కనుగొంది. ‘ది జర్నల్ ఆఫ్ క్లినికల్ ఎండోక్రినాలజీ & మెటబాలిజం’ లో ప్రచురించబడిన అధ్యయనంలో, స్పెయిన్లోని ఒక ఆసుపత్రిలో చేరిన 216 కోవిడ్-19 రోగులలో 80 శాతం విటమిన్ డి లోపం ఉన్నట్లు తేలింది. మహిళల కంటే పురుషుల్లో విటమిన్ డి స్థాయి తక్కువగా ఉందని పరిశోధకులు గమనించారు.
‘ప్లోస్ వన్’ జర్నల్లో ప్రచురించబడిన మరో తాజా అధ్యయనం, విటమిన్ డి సమృద్ధిగా ఉన్న కోవిడ్-19 రోగులలో రక్తపోటు మరియు హృదయ సంబంధ వ్యాధులు, శ్వాసకోశ సమస్యలు తగ్గిస్తుందని మరియు రోగనిరోధక శక్తి పెరిగి కరోనా నుండి త్వరగా కోలుకోవడానికి సహాయం చేస్తుంది అని పేరుకొన్నారు.
అయితే సూర్యరశ్మి వల్ల అందని విటమిన్-డి లోపాన్ని పుట్టగొడుగులు, చేపలు, పాలు, జున్ను ఇతర పాల ఉత్పత్తులు, గుడ్లు సొనలు, కమలాపళ్ళు, ఓట్’స్, ఆకుకూరలు, బీన్స్, దానిమ్మ, బొప్పాయి, రాగులు, మొక్కజొన్న వంటి వాటితో భర్తీ చేయవచ్చు. మాస్క్ ను ధరిస్తూ, సామాజిక దూరం పాటిస్తూ , రోగ నిరోధక శక్తీ పెంచుకోవడం ద్వారా కోవిడ్-19 నుండి మనల్ని మనము కాపాడుకోగలం అని డాక్టర్లు సూచిస్తున్నారు.