Weight Loss : మనకు ఎన్నో రకాల ఆరోగ్యకర ప్రయోజనాలుకలిగించడంలో చేపలు ముఖ్యపాత్ర పోషిస్తాయి అని మన అందరికీ తెలిసిందే. చేపల్లో మన శరీరానికి ఉపయోగపడే ఎన్నో ముఖ్యమైన పోషకాలు విటమిన్లు, మినరల్స్ మనకు చేపల నుండి లభిస్తాయి. ఈ కారణంతోనే ప్రతి రోజు చేపలను తినాలని డాక్టర్లు కూడా సూచిస్తున్నారు. చేపలను తింటే అధిక బరువు తగ్గుతాం అన్న సందేహం చాలా మంది కి వస్తుంది. చేపలను తింటే బరువు తగ్గుతారా..? అన్న వివరాలను తెలుసుకుందాం.
అధిక బరువు తగ్గడం మీద సైంటిస్టులు చేపట్టిన కొన్ని పరిశోధనల్లో చేపలనుతింటే అధిక బరువు తేలికగా తగ్గవచ్చని తేలింది. కానీ వారంలో ఒకటి, రెండు సార్లు మాత్రమే చేపలను తింటే సరిపోదు. ప్రతిరోజూ ఆహారంలో చేపలు ఉండేలా చూసుకోవాలి సిందే. రోజుకి 140 గ్రాముల చేపలను తింటే మాత్రమే అధిక బరువు తగ్గుతారని సైంటిస్టులు తెలియచేస్తున్నారు.ఎందుకంటే చేపల్లో ఉండే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్నుతగ్గించడం లో సమర్ధవంతం గా పనిచేసి బరువు తగ్గడానికి కారణమవుతుంది.
ఇక ఆరోగ్యకరమైన ప్రోటీన్లు కూడా చేపల్లోఎక్కువగా ఉంటాయి. ఇవి మన ఆకలినితగ్గిస్తాయి. అందువల్ల తక్కువ ఆహారం తీసుకోవడం ఫలితంగా అధిక బరువు తగ్గుతారు. కాబట్టి చేపలను తింటే అధిక బరువు కచ్చితంగా తగ్గుతారని సైంటిస్టులు చెబుతున్నారు..
అంతే కాదు..వయస్సు మీద పడడం వల్ల ఎవరికైనా సహజంగానే మతిమరుపు ఉంటుంది. కొందరిలో ఇది తీవ్రమైన అల్జీమర్స్కుకారణమవుతుంది. ఆ సమస్య ఉన్నవారు చేపలు తినడం వల్ల ఆ సమస్య ను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చని పలువురు అమెరికన్ సైంటిస్టులు 2016లో చేపట్టిన పరిశోధనలో తేలింది. చేపలు తినడం వల్ల మెదడు బాగా పని చేసి జ్ఞాపకశక్తి పెరుగుతుంది సూచిస్తున్నారు.