ఆంధ్రప్రదేశ్ ప్రజల అదృష్టం ఏమంటే సీరియస్ రాజకీయాలతో బుర్ర వేడెక్కిన సమయంలో లోకేశ్, కేఏ పాల్ ఎంటరై కామెడీ పండిస్తూ జనాల్ని కూల్ చేసేవాళ్లు.లోకేశ్ స్థానాన్ని కేఏ పాల్ భర్తీ చేస్తే…తాజాగా పాల్ స్థానాన్ని మరొక నేత కొల్లగొట్టారు.
ఆయనే పవర్స్టార్ పవన్కల్యాణ్. గురు, శుక్రవారాల్లో జనసేన పార్టీ తమ అధినేత పవన్కల్యాణ్ ఇంటర్వ్యూ వీడియోలను విడుదల చేసింది. ఈ వీడియోల్లో పవన్ చెప్పిన అంశాల్లో కొత్తదనం లేకపోగా….తన అజ్ఞానాన్ని ప్రదర్శించినట్టుగా ఉంది. ఇంకా చెప్పాలంటే ఓ కమెడియన్ పాత్ర పోషించినట్టుంది.ముఖ్యంగా కాపు రిజర్వేషన్ల అంశంపై పవన్ చెప్పిన తీరు జనసైనికులకే నవ్వు తెప్పించేలా ఉందంటే…ఇక ఆయన ప్రత్యర్థులకు ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.”కాపు రిజర్వేషన్లకు సంబంధించి.. మేము ఇవ్వమని జగన్ గతంలోనే స్పష్టంగా చెప్పారు. అయినా ప్రజలు గెలిపించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్ రెడ్డి, ఇతర మంత్రులు కూడా ప్రజలకు మరోసారి చెబితే రిజర్వేషన్లపై స్పష్టత వస్తుంది” అని పవన్ పేర్కొన్నారు.నిన్న ఇచ్చిన ఇంటర్వ్యూలో మాత్రం రాజధాని మార్పు విషయమై జగన్ ఎన్నికల ముందు చెప్పలేదని విమర్శించారు. ఇప్పుడు కాపు రిజర్వేషన్లపై మళ్లీ ఒకసారి చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఇది ఏం రాజకీయమో? అసలు పవన్ తానేం చెప్పదలచుకుంటున్నారో ఆయనకే స్పష్టత లేదు. కాపు రిజర్వేషన్ చట్రంలో జగన్ను ఇరికించి రాజకీయ పబ్బం గడుపుకోవాలని పవన్ ఆలోచిస్తున్నట్టున్నారు. పవన్ మాటలు మరీ చిలిపిగా ఉన్నాయి. అందుకే కేఏ పాల్ను పవన్ మించిపోయారంటే అతిశయోక్తి కాదేమో!మొత్తంమీద పవన్ కు ఏ విషయంలోనూ క్లారిటీ లేదని మరోసారి స్పష్టమైంది.