గుంటూరు: వైసిపి సీనియర్ నాయకుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గుంటూరు కలెక్టరేట్ వద్ద ఆందోళన చేస్తున్న ఎంపిఇఒల దీక్షను విరమింపజేసేందుకు బుధవారం ఆయన అక్కడకు చేరుకున్నారు. సమస్యలన్నీ ముఖ్యమంత్రి జగన్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తానని వారికి హామీ ఇచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడుతుండగా వాంతులు చేసుకొని సొమ్మసిల్లి పడిపోయారు. వెంటనే పార్టీ నాయకులు ఆయనను ఆసుపత్రికి తరలించారు.
గుంటూరు జిల్లా బాపట్ల మండలం కొండుబెట్లపాలెంకు చెందిన ఉమ్మారెడ్డి వైసిపిలో కీలకనేతగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.