YS Viveka: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఓ పెద్ద అరెస్టుకు రంగం సిద్దం అవుతోంది. ఇటీవల వరుసగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఈ కేసుకు టీమ్ హెడ్ గా ఉన్న సీబీఐ డీఐజీ ర్యాంక్ అధికారి చౌరాసియా కడపకు రావడంతో రెండు మూడు రోజుల్లో ఓ పెద్ద అరెస్టు జరగబోతున్నాయనే పరిస్థితులు కనబడుతున్నాయి. ఈ కేసులో మూడవ నిందితుడైన దస్తగిరిని అప్రూవర్ గా మారడానికి హైకోర్టు అంగీకరించడం, ప్రధానంగా ఈ కేసులో ఏ 1 నుండి ఏ 4 వరకూ ఉన్న నిందితులతో పాటు ఏ 5 నిందితుడిని అరెస్టు చేయడం, ఈ కేసులో అవినాష్ రెడ్డి పాత్ర ఉన్నట్లు సీబీఐ దాఖలు చేసిన చార్జిషీటు బయటకు రావడం, ఈ పరిణామాల నేపథ్యంలో సీబీఐ డీఐజీ ర్యాంక్ అధికారి చౌరాసియా కడపకు వచ్చి ప్రధాన నిందితులతో మాట్లాడుతుండటంతో ఈ కేసు దర్యాప్తు అధికారులతో ఆయన రోజు రివ్యూలు చేస్తుండంతో ఈ రెండు మూడు రోజుల్లోనే ఓ పెద్ద అరెస్టు జరగబోతున్నది అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
YS Viveka: దస్తగిరితో మరో సారి సాక్షాల నమోదు
ఆ అరెస్టు జరిగితే శాంతి భద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉంది కాబట్టి దాన్ని కంట్రోల్ చేసేందుకు కూడా రెండు రోజుల్లో ప్రత్యేక టీమ్ లను కూడా పిలిపించనున్నారని వార్తలు వినబడుతున్నాయి. ఆ అరెస్టు జరిగితే ఎవరిని చేస్తారు..? శాంతి భద్రతల విఘాతానికి ఎటువంటి గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి అనేది ఊహించవచ్చు. అప్రూవర్ గా దస్తగిరి మారేందుకు హైకోర్టు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో సీబీఐ అధికారులు అతనితో మరో సారి మెజిస్ట్రేట్ సమక్షంలో సాక్షాలను నమోదు చేసేందుకు సిద్ధం అవుతున్నారు. ఈ నేపథ్యంలోనే కడప జిల్లా రాజారెడ్డి ఆసుపత్రిలో పని చేస్తున్న కాంపౌండర్ శ్రీనివాసరెడ్డిని సీబీఐ అధికారులు పిలిపించి విచారణ చేస్తున్నారు. అయన మీద చాలా అనుమానాలు ఉన్నాయి.
కాంపౌండర్ శ్రీనివాసరెడ్డిని విచారించిన సీబీఐ
వైఎస్ వివేకా చనిపోయిన తరువాత ఆయన మృతదేహంపై గాయాలకు శ్రీనివాసరెడ్డే కుట్లు వేసినట్లు గుర్తించిన సీిబీఐ అధికారులు ఆయనను విచారిస్తున్నారు. ఎవరు కుట్లు వేయమంటే శ్రీనివాసరెడ్డి కుట్లు వేశారు. ఎవరు పిలిపించారు అనే విషయాలను ఆరా తీస్తున్నారు. ఈ కేసులో ఎవరెవరు కీలకంగా ఉన్నారు. ఎవరెవరు సాక్షాలను తారు మారు చేశారు, ఎవరు చేయించారు అనేది సీబీఐకి ఒక క్లారిటీ వచ్చేసింది. ఇక ఫైనల్ అరెస్టే మిగిలి ఉంది. దాని కోసమే ఢిల్లీ నుండి ఉన్నతాధికారి వచ్చారు అనే టాక్ నడుస్తోంది. చూడాలి ఏమి జరుగుతుందో.