Breaking: అహ్మదాబాద్ వరుస బాంబు పేలుళ్ల కేసులో నిందితులపై నేరం నిరూపణ అవ్వడంతో ప్రత్యేక కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న 38 మందికి మరణ శిక్ష విధించింది ప్రత్యేక కోర్టు. అహ్మదాబాద్ నగరంలో 2008లో జరిగిన వరుస బాంబు పేలుళ్ల కేసు దేశ వ్యాప్తంగా సంచలనం అయ్యింది. దాదాపు పదమూడు సంవత్సరాల తర్వాత కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ కేసులో 28 మందిని నిర్దోషులుగా ప్రకటించింది. ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఈ కేసును విచారించింది.
Breaking: 13 ఏళ్ల తరువాత తీర్పు
2008 సంవత్సరంలో దుండగులు అహ్మదాబాద్ సిటీలోని 18 ప్రాంతాల్లో బాంబులు అమర్చారు. కొన్ని ప్రదేశాల్లో పేలడంతో బాంబ్ దాడిలో 56 మంది మృతి చెందారు. 200 మంది వరకూ గాయపడ్డారు. బాంబ్ లను స్కైవేలు, పుట్ ఓవర్ బ్రిడ్జ్ లు, బస్టాండ్లను లక్ష్యంగా చేరుకుని అమర్చారు. జనసమర్ధం ఉండే ప్రాంతాల్లో బాంబులు అమర్చారు. అయితే బాంబు స్క్వాడ్ సిబ్బంది కొన్ని చోట్ల పెట్టిన బాంబులు పేలకముందే గుర్తించి నిర్వీర్యం చేశారు. దీంతో పెద్ద ఎత్తున ప్రాణ నష్టం తప్పినట్లు అయ్యింది. ఈ కేసులో ఎట్టకేలకు నిందితులకు ప్రత్యేక కోర్టు శిక్షలను ఖరారు చేస్తూ సంచలన తీర్పు ఇచ్చింది.