అమరావతి, మార్చి 21: దివంగత మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు తప్పుదారి పట్టించే ప్రయత్నం జరుగుతోందని వివేకా కుమార్తె డాక్టర్ సునీతారెడ్డి ఆరోపించారు.
గురువారం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సిఈవో) గోపాలకృష్ణ ద్వివేదిని సునీతారెడ్డి కలిసి ఈ మేరకు ఫిర్యాదు అందజేశారు.
సిట్ దర్యాప్తు సక్రమంగా జరిగేలా చూడాలని సిఇవోను కోరారు. తన తండ్రి హత్యకేసును నిష్పక్షపాతంగా విచారణ చేసి అసలు దోషులకు శిక్షపడేలా చేయాలని విజ్ఞప్తి చేశారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ దర్యాప్తు సజావుగా జరిగేలా చర్యలు చేపట్టాలని కోరామని సునీతారెడ్డి చెప్పారు.