ఫైల్ ఫోటో..
కర్నూలు, మార్చి 21: కర్నూలు సిట్టింగ్ ఎమ్మెల్యే ఎస్వి మోహనరెడ్డి తెలుగుదేశం పార్టీని వీడి తిరిగి వైసిపిలో చేరేందుకు సిద్ధమయ్యారు.
కర్నూలు అసెంబ్లీ టికెట్ సిట్టింగ్ ఎమ్మెల్యేనైన తనకు కాకుండా టిజి భరత్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయడంపై ఎస్వి మోహనరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తు కార్యాచరణకై గురువారం కార్యకర్తలు, అభిమానులతో సమావేశం నిర్వహించారు.
చంద్రబాబు తనకు తీరని అన్యాయం చేశారని ఆరోపించారు. నమ్మించి తనను మోసం చేశాడని అన్నారు. నాడు వైసిపిని వీడి జగన్కు అన్యాయం చేశానని ఆవేదన వ్యక్తం చేశారు.
సాయంత్రం వైసిపి అధినేత జగన్మోహనరెడ్డితో భేటీ అయి పార్టీలో చేరనున్నట్లు తెలిపారు. వైసిపి అభ్యర్థి హఫీజ్ విజయానికి కృషి చేస్తానని తెలిపారు.
2014 ఎన్నికల్లో టిడిపి అభ్యర్థి టిజి వెంకటేష్పై వైసిపి అభ్యర్థిగా ఎస్వి మోహనరెడ్డి విజయం సాధించారు. తరువాత టిడిపిలో చేరారు.