అమరావతి, జనవరి 29: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు బుధవారం నుండి ప్రారంభం కానున్నాయి. తొలిరోజు గవర్నర్ నరసింహన్ ప్రసంగం ఉంటుందని స్పీకర్ కోడెల శివప్రసాదరావు తెలిపారు. ఈనెల 31న ఇటీవల మరణించిన సభ్యలకు సంతాప తీర్మానాలు ఉంటాయని ఆయన చెప్పారు. ఫిబ్రవరి ఒకటవ తేదీనుంచి నాల్గవ తేవరకు సభకు సెలవులు ఉంటాయని ఆయన తెలిపారు.
ఫిబ్రవరి ఐదవ తేదీన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నట్లు ఆయన చెప్పారు. బడ్జెట్పై ఆరవ తేదీ నుండి ఎనిమిదవ తేదీవరకు చర్చించనున్నట్లు ఆయన తెలిపారు.
ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ గత సమావేశాల నుండి అసెంబ్లీకి హాజరుకావడంలేదు.