అహ్మదాబాద్, జనవరి29: గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి శంకర్సింగ్ వాఘేలా నేషలిస్ట్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎన్సిపి అధినేత శరద్ పవార్ వాఘేలాకు కండువా కప్పి మంగళవారం పార్టీలోకి ఆహ్వానించారు. గుజరాత్లో మొత్తం 26 పార్లమెంట్ స్థానాలు ఉండగా భారతీయ జనతాపార్టీ 2014 ఎన్నికల్లో అన్ని స్థానాలను గెలుచుకుంది. రానున్న ఎన్నికల్లో లోక్సభ స్థానాలను కైవసం చేసుకోవాలని ఎన్సిపి భావిస్తోంది.
భారతీయ జన్ సంఘ్ పార్టీతో ఆయన మాజీ ముఖ్యమంత్రి తన రాజకీయ ప్రస్తానం ప్రారంభించారు. జన్సంఘ్ విడిపోయిన తర్వాత 1996లో బిజెపిలో ఆయన సీనియర్ నేతగా కొనసాగారు. ఆయన బిజెపినుంచి విడిపోయి రాష్ట్రీయ జనతా పార్టీని ఏర్పాటు చేశారు. 1996-97 కాలంలో ఆయన గుజరాత్కు ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. అనంతరం పార్టీని 2017లో కాంగ్రెస్లో విలీనం చేశారు. 2017 జులై 21న కాంగ్రెస్పార్టీనుండి వైదొలిగి జనవికల్ప్ మోర్చాను స్థాపించారు. ఆయన ఇప్పటివరకు ఐదు సార్లు లోక్సభ సభ్యుడిగా కొనసాగారు.