అమరావతి, జనవరి 26: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి భారతరత్న పరస్కారం ప్రకటించడాన్ని ప్రజాశాంతి పార్టీ అధినేత కెఎ పాల్ తప్పుబట్టారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రణబ్కు భారతరత్న ప్రకటించిన రోజు ఒక బ్లాక్డేగా ఆయన వ్యాఖ్యానించారు. ఆయనకు భారతరత్న పురస్కారం అందుకునే అర్హతలేదని పాల్ అన్నారు.
ప్రణబ్పై అమెరికాలో తమ సంస్థ క్రిమినల్ కేసులను వేసిందని చెప్పారు. అమెరికా నుండి ప్రణబ్కు సమన్లు కూడా అందాయని పాల్ తెలిపారు. 2004లో ప్రణబ్ ముఖర్జీ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా, ఎపిలో వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారనీ, వీరు ఇద్దరు కలిసి ప్రపంచ శాంతి కోసం పని చేస్తున్న గ్లోబల్ పీస్ సంస్థను అడ్డుకున్నారని పాల్ విమర్శించారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ భగవత్ను ప్రణబ్ ముఖర్జీ కలవడం వల్లనే భారతరత్న ఇచ్చారని ఆయన అన్నారు.
ప్రపంచ శాంతి కోసం పాటుపడిన దివంగత లోక్సభ స్పీకర్ బాలయోగికి ఎందకు ఇవ్వలేదని ప్రశ్నించారు. దలితుడు కావడం వల్లనే ఆయనకు పరస్కారం ఇవ్వలేదా అని పాల్ ప్రశ్నించారు.