కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి పార్టీ ఎన్నడూ లేనివిధంగా దక్షిణాదిలో వైసిపి పార్టీ కి ప్రాధాన్యత ఇచ్చే రీతిలో వ్యవహరిస్తున్నట్లు జాతీయ మీడియా వర్గాల్లో టాక్. ఇటీవల ఎన్డీఏ కూటమి నుండి ఒకో రాజకీయ పార్టీ బయటకు వెళ్లి పోతున్న తరుణంలో… ముందు జాగ్రత్తగా బిజెపి పార్టీ వైసిపి పార్టీని లైన్ లో పెట్టుకున్నట్లు టాక్. ఇటువంటి తరుణంలో కేంద్ర మంత్రివర్గంలోకి వైసిపి పార్టీ నీ తీసుకునేందుకు మోడీ ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఉన్న కొద్ది బీజేపీ పార్టీపై దేశ వ్యాప్తంగా ఇటీవల వ్యతిరేక పవనాలు వీస్తున్న తరుణంలో ఇండియా కూటమి నుండి వెళ్ళిపోతున్నా పార్టీల స్థానాలలో వేరే పార్టీలను తీసుకువచ్చే ప్యాచ్ వర్క్ స్టార్ట్ చేయడం జరిగిందట. ఇటీవల మోడీ సర్కార్ తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులు వ్యతిరేకిస్తూ ఎన్డీఏ కూటమి నుండి బయటికి వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో కేంద్ర మంత్రివర్గం నుంచి హరా సిమ్రత్ కౌర్ కలిగారు. అదే విధంగా కేంద్ర మంత్రివర్గంలో ఉన్న కొంతమంది మంత్రులు అనారోగ్యం ఫాలో అవుతూ ఉన్నారు.
ఇటువంటి తరుణంలో వైసిపి పార్టీని ఎన్డీయేలోకి తీసుకొచ్చి కేంద్ర మంత్రివర్గంలో చోటు కల్పించడానికి బిజెపి తహతహలాడుతున్న ట్లు వార్తలు వస్తున్నాయి. మరోపక్క వైసీపీ పార్టీ బయట ఉన్నా గాని బిజెపి పార్టీకి పలు కీలక వంశాలకు సంబంధించి మద్దతు తెలుపుతూ రావడం జరిగింది. కాగా కేంద్ర మంత్రి వర్గంలోకి తీసుకురావడం కోసం బిజెపి నాయకులు చేస్తున్న ప్రయత్నాలకు జగన్ అంతగా ప్రాధాన్యత ఇవ్వడం లేదన్న టాక్ వైసీపీలో వస్తుంది. కేవలం రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి విభజన హామీలను నెరవేర్చుకోవడం అదేవిధంగా నిధులు సకాలంలో అందేలా కేంద్రం నుండి రాబట్టడం కోసం మాత్రమే బీజేపీకి బయటనుండి సపోర్ట్ ఇచ్చే ఆలోచనలో జగన్ ఉన్నట్లు టాక్.