ఏపీ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడిగా సోము వీర్రాజు ఎన్నికైన తరువాత వైయస్ జగన్ పై విమర్శలు చేస్తూ టిడిపి పోషించాల్సిన ప్రతిపక్షాన్ని బిజెపి పోషించే రీతిలో ఏపీలో రాజకీయాన్ని నడిపించారు. ఏపీలో దేవాలయాలపై దాడులు విషయంలో ఉద్యమాన్ని రగిల్చే విధంగా సోము వీర్రాజు.. ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. అవ్వడంతో ఆ సమయంలో బీజేపీతో వైసిపి పొత్తు అనే వార్తలు రావటం తో ఏపీలో చాలావరకు జగన్ పై విమర్శలు చేయటం తగ్గించింది.
మొన్నటివరకు ఏపీ బీజేపీ నేతలు ఎవరు ప్రభుత్వంపై విమర్శలు చేసిన దాఖలాలు లేవు. మరి ఇంతలోనే ఏమయ్యిందో ఏమో తెలియదు గానీ…ప్రభుత్వం నష్టపరిహారం అందించడంలో విఫలం అయిందని రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. ఇటీవల బిజెపి నాయకులతో వర్చువల్ మీటింగ్ లో రాష్ట్రంలో జరిగిన నష్టాన్ని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి పురుషోత్తం కు వివరించారు.
ఆ తర్వాత మీడియా సమావేశం నిర్వహించి పనిగట్టుకుని మరీ జగన్ ప్రభుత్వం పై ఓ రేంజ్ లో విమర్శల వర్షం కురిపించారు. ఏపీ వరద నష్టం విషయంలో తక్షణ సహాయం కింద నిధులు కూడా మంజూరు చేయకుండా వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తుందని సోము మండిపడ్డారు. కానీ జగన్ సర్కార్ ఇప్పటికే కేంద్రానికి లెటర్ రాసి తక్షణ సహాయం కింద నిధులు మంజూరు చేయాలని కోరటం జరిగింది. అలాంటి క్రమంలో ఏపీ బీజేపీ నేతలు మొన్నటివరకు సైలెంట్ గా ఉండి ఇప్పుడు తాజాగా ఒక్కసారిగా జగన్ పై విమర్శలు చేయడం ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది.