రెండు తెలుగు రాష్ట్రాలతో సహా అయిదు రాష్ట్రాలకు కేంద్ర ఆర్థిక శాఖ గుడ్ న్యూస్ తెలియజేసింది. అయిదు రాష్ట్రాలు అదనపు రుణం తీసుకునేందుకు కేంద్ర ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రూ.2,525 కోట్లు, తెలంగాణ రాష్ట్రానికి రూ.2508 కోట్లు అదనపు రుణం పొందేందుకు కేంద్రం వెసులుబాటు ఇచ్చింది.
సులభతర వాణి్జ్య సంస్కరణలు అమలు చేసినందుకు కేంద్రం ఈ వెసులుబాటు ఇచ్చింది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు మధ్యప్రదేశ్, తమిళనాడు, కర్నాటక రాష్ట్రాలకూ కేంద్రం అనుమతి ఇచ్చింది. ఈ అయిదు రాష్ట్రాలకు కలిపి రూ.16,728 కోట్లు రుణంగా తీసుకునే వీలు ఉంది. ఒకే దేశం – ఒకే రేషన్, పట్టణ, స్థానిక సంస్థలు, విద్యుత్ రంగ సంస్కరణలు అమలు చేసినందుకు అదనపు రుణాలు తీసుకునే వెసులుబాటును కేంద్ర ఆర్థిక శాఖ కల్పించింది.