పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ తర్వాత నటిచబోతున్న సినిమా మలయాళ సూపర్ హిట్ అయ్యప్పనం కోషియం తెలుగు రీమేక్. ఈ సినిమా జనవరి నుంచి సెట్స్ మీదకి వెళ్ళబోతోంది. పిడివి ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో ఈ సినిమా భారీ మల్టీస్టారర్ గా తెరకెక్కబోతోంది. యంగ్ డైరెక్టర్ సాగర్ కే చంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు. మాటల మాంత్రీకుడు త్రివిక్రం శ్రీనివాస్ ఈ సినిమాకి డైలాగ్స్ రాస్తున్నారు. అయితే ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ అయినప్పటి నుంచి మరొక హీరో ఎవరన్నది సస్పెన్స్ లో ఉంది.
పవన్ కళ్యాణ్ ఒక హీరోగా ఫిక్స్ అయ్యాక మరొక హీరో విషయంలో చాలామంది పేర్లు పరిశీలనలో నిలిచాయి. అంతేకాదు చాలామంది హీరోల పేర్లు ప్రచారంలో నిలిచాయి. అయితే గత కొన్ని రోజులుగా మాత్రం ఈ సినిమాలో నటించబోయే మరొక హీరో రానా దగ్గుబాటి అని మాత్రం బాగా వినిపించింది. సోషల్ మీడియాలో కూడా ఎక్కువగా రానా పేరే వార్తల్లో నిలిచింది. కాగా ఎట్టకేలకి ఈ ప్రాజెక్ట్ లోకి రానా దగ్గుబాటి జాయిన్ అవుతున్నాడని మేకర్స్ వెల్లడించారు. అంతేకాదు ఇందుకు సంబంధించిన అఫీషియల్ న్యూస్ కూడా రేపు రాబోతోంది.
మొత్తానికి పెద్ద సస్పెన్స్ కి తెర దించారు దర్శక నిర్మాతలు. దాంతో భారీ అంచనాలు మొదలయ్యాయి. ఇక అయ్యప్పనం కోషియం మలయాళంలో బిజు మీనన్ పోషించిన పోలీస్ ఆఫీసర్ పాత్రలో పవన్.. పృథ్వీరాజ్ పోషించిన పాత్రలో రానా నటించబోతున్నాడు. కాగా ఈ సినిమాకి థమన్ సంగీతమందిస్తున్నాడు. కాగా ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ చేస్తారని సమాచారం. విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం 2021 డిసెంబర్ లో రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది. కాగా పవన్ కళ్యాణ్ వరసగా సినిమాలు కమిటయిన సంగతి తెలిసిందే. రానా కూడా అరణ్య సినిమా ని రిలీజ్ కి రెడీ చేశాడు. అలాగే విరాట పర్వం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది.