Chandrababu: తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో ఎలాగైనా విజయం సాధించాలని తెలుగుదేశం పార్టీ కీలక నేతలు ఇప్పటికే రంగంలోకి దిగారు. తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో ముమ్మరంగా పాల్గొంటూ అధికార పార్టీ వైసీపీ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ ఉన్నారు. చంద్రబాబు, లోకేష్, అచ్చెన్నాయుడు ఇంకా చాలామంది పార్టీలో ఉన్న కీలక నేతలు తిరుపతి ప్రచారంలో పాల్గొంటూ ఎలాగైనా విజయం సాధించాలని ఆడుకుంటున్నారు. పరిస్థితి ఇలా ఉండగా మరో పక్క తిరుపతిలో కరోనా విజృంభణ వారి స్థాయిలో ఉంది.
ఇలాంటి తరుణంలో ప్రచారాలకు మరియు సభ్యులకు వెళితే ప్రజలకు మరింత ప్రమాదం అని జగన్ ఇటీవల ఏప్రిల్ 14న రోడ్ షో మరియు ప్రచార సభ నిర్వహించాలని భావించి క్యాన్సిల్ చేసుకోవటం జరిగింది. మరోపక్క ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వివిధ పార్టీలకు చెందిన నేతలకు కరోనా పాజిటివ్ రిపోర్టులు రావడంతో చాలామంది హోమ్ క్వారంటైన్ లోకి వెళ్ళి పోతున్నారు. ఈ క్రమంలో టీడీపీ పార్టీకి చెందిన చాలా మంది నేతలు కరోనా బారిన పడటం తెలిసిందే.
ఇదిలా ఉంటే తాజాగా శ్రీకాళహస్తి నియోజకవర్గం టీడీపీ ఇన్చార్జి బొజ్జల సుధీర్ రెడ్డి కరోనా బారిన పడటం జరిగింది. 2 రోజుల క్రితం సుధీర్ రెడ్డి కనీసం మాస్కులు లేకుండా చంద్రబాబు పక్కనే సన్నిహితంగా ఉంటూ ప్రచారంలో పాల్గొన్నారు. రోడ్ షో లో కూడా మాస్కు ధరించకుండా చంద్రబాబు పక్కనే ఉండి సుధీర్ రెడ్డి ప్రసంగించడం జరిగింది. ఇప్పుడు ఆయనకి కరోనా రావటంతో చంద్రబాబు లో టెన్షన్ మొదలైనట్లు టీడీపీ శ్రేణుల నుంచి అందుతున్న టాక్. ఇదే క్రమంలో మరింతమంది నాయకులు శ్రీకాళహస్తి సమయంలో చంద్రబాబుతో సుధీర్ రెడ్డి తో కలిసి తిరిగిన వారిలో కూడా టెన్షన్ మొదలైనట్లు వార్తలు వస్తున్నాయి.