అమరావతి, ఏప్రిల్ 9: చీరాల సిఐ ప్రసాద్ పై సిట్టింగ్ ఎమ్మెల్యే, వైసిపి అభ్యర్ధి ఆమంచి కృష్ణమోహన్ రాష్ఠ్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేదికి ఫిర్యాదు చేశారు.
మంగళవారం వైసిపి అభ్యర్ధి ఆమంచి కృష్ణమోహన్ బూత్ కమిటీ ఎజంట్ లతో అంతర్గత సమావేశం ఎర్పాటు చేసుకున్నారు. బూత్ కమిటీ సభ్యులతో ఆమంచి సమావేశం నిర్వహిస్తుండగా అక్కడకు చేరుకున్న సిఐ ప్రసాద్ సమావేశానికి అనుమతి లేదంటూ ఆభ్యంతరం వ్యక్తం చేశారు.
తాము అంతర్గత నమావేశం నిర్వహించుకుంటున్నామని అమంచి సిఐకి వివరణ ఇచ్చారు. అయితే విధి నిర్వహణను అడ్డుకున్నారంటూ సిట్టింగ్ ఎమ్మెల్యే, వైసిపి అభ్యర్ధి ఆమంచిపై సిఐ ప్రసాద్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు.
ఈ ఘటనకు సంబందించి సిఐ ప్రసాద్ పై ఆమంచి ఇసికి ఫిర్యాదు చేశారు.