ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది తెలంగాణపై ప్రకృతి పగ తీర్చుకుంటున్న ట్లు పరిస్థితి నెలకొంది. భారీ వర్షాలు తో తెలంగాణలో పంట నష్టం ప్రాణ నష్టం వాటిల్లింది. కుండపోత వర్షాల వల్ల హైదరాబాద్ నగరం దాదాపు జలమయం అయిపోయింది. ప్రభుత్వాలు స్వచ్ఛంద సంస్థలు హైదరాబాద్ నగర వాసులను కాపాడటం కోసం భారీ విరాళాలు ప్రకటిస్తున్నారు. ఇదిలా ఉండగా అంతకు ముందు తెలంగాణ రాష్ట్రాన్ని కరోనా మహమ్మారి షేక్ చేసి పడేసిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
కరోనా వైరస్ భారీస్థాయిలో తెలంగాణలో వ్యాప్తి చెందింది అని పలు సర్వేలు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వాలు పలుసార్లు హెచ్చరించిన దాఖలాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం భారీ స్థాయిలో వర్షాలు పడటంతో.. మరింతగా వైరస్ బలపడే పరిస్థితులు నెలకొన్నాయి. కాగా తీవ్ర వర్షాల వల్ల ప్రజలను చాలా రాజకీయ పార్టీల నాయకులు పలకరిస్తూ ధైర్యం చెబుతున్నారు.
ఇటువంటి తరుణంలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఇద్దరు ఎంపీలు కరోనా బారిన పడటం జరిగింది. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ లకు పాజిటివ్ నిర్ధారణ అయింది. కోమటిరెడ్డి దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు… దీంతో ఆ సమయంలో ఈ మహమ్మారి బారిన పడినట్లుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం తమ ఆరోగ్యం నిలకడగానే ఉందని… చెప్పిన ఇద్దరు ఎంపీలు తమ తో కాంటాక్ట్ అయినా ప్రతి ఒక్కరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలని కోరారు.