ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి దివంగత వైయస్ రాజశేఖర రెడ్డికి భారతరత్న ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేదవారికి సంక్షేమ పథకాలు అందించడంలో వారి జీవితాల్లో అభివృద్ధి కలిగేలా తీసుకున్న నిర్ణయాల వల్ల వైయస్ రాజశేఖర్ రెడ్డికి ఖచ్చితంగా భారతరత్న ఇవ్వాలని అన్ని విధాలా ఆయన భారతరత్న అవార్డుకి అర్హుడని స్పష్టం చేశారు. దేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత ప్రజలకు మేలు చేసిన ముఖ్యమంత్రులలో మహానేత మొదటి స్థానంలో నిలుస్తారని, దేశవ్యాప్తంగా సర్వేలు చేసి వైయస్ రాజశేఖర్ రెడ్డి కి భారతరత్న ఇవ్వాలన్నారు.
అంతేకాకుండా పేదల బతుకుల్లో అనేక మార్పులు తీసుకువచ్చి వారికి అండగా నిలిచిన నాయకుడు మరియు అపర భగీరధుడు వైయస్ రాజశేఖర్ రెడ్డి అంటూ కొనియాడారు. ఇటీవల వైయస్ 11 వ వర్ధంతి సందర్భంగా వైఎస్ఆర్ జిల్లాలో ప్రధాన కార్యాలయంలో వైఎస్ చిత్రపటానికి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులూ, కౌన్సిలర్లు, కార్యకర్తలు వైఎస్ కుటుంబానికి అభిమానులు మరియు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. అంతేకాకుండా ఎమ్మెల్సీ జఖియ ఖానంలు కూడా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….ప్రతి ఒక్కరి జీవితంలో మేలు చేసిన నాయకుడు గా … మహానేత గా వైయస్సార్ కొనియాడుతున్నారు అని పేర్కొన్నారు. సంక్షేమానికి పెద్దపీట వేస్తూ రైతులు విద్యార్థులు బడుగు బలహీన వర్గాలతో పాటు మైనారిటీల సంక్షేమం కోసం పొరపాటు పడి ప్రతి ఒక్కరికి అండగా నిలిచిన నాయకుడు వైయస్సార్ అని స్పష్టం చేశారు. కాగా తండ్రి వైయస్సార్ మాదిరిగానే ప్రస్తుతం ఆయన తనయుడు వైఎస్ జగన్ పరిపాలన కూడా కొనసాగుతుందని, అటువంటి మహానాయకుడు నుండి వచ్చిన జగన్ పరిపాలన లో మేము కూడా భాగం కావడం గర్వంగా ఉందని అన్నారు.
ఇదిలా ఉండగా పార్టీ నేతల నుండి మరియు వై.ఎస్ అభిమానుల నుండి కచ్చితంగా వైయస్సార్ కి భారతరత్న రావాలని డిమాండ్ వస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ ఈ విషయంపై ఎలాగూ ముందుకు వెళ్తారు అన్నది ఎవరికీ అర్థం కావడం లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి భారత రత్న అవార్డు కోసం ఇప్పటికే పలువురు నాయకుల పేర్లను కొంతమంది ప్రతిపాదిస్తున్నారు. ఈ తరుణంలో జగన్ తన తండ్రి కోసం మిగతా వారి పేర్లు పక్కనపెట్టే త్యాగం చేయగలరా అనే క్వశ్చన్ మార్క్ ప్రతి ఒక్కరిలో నెలకొంది.