Ys Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మహమ్మారి కరోనా తో పోరాడి చనిపోయిన వారి విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. మేటర్ లోకి వెళ్తే కరోనాతో చనిపోయిన వారి అంతిమ సంస్కారాలకు 15 వేల రూపాయల ఆర్థిక సాయం చేయటానికి ఏపీ ప్రభుత్వం రెడీ అయింది. ఇటీవల చాలావరకు కరోనాతో చనిపోయినవారి మృతదేహాలను సొంత కుటుంబ సభ్యులు వదిలేస్తున్న పరిస్థితి నెలకొని ఉండటం తో మానవతా దృక్పథం లో జగన్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది అంట. అలా రాష్ట్రాలలో కరోనాతో చనిపోయిన వారిని నదులలో పడేస్తూ అనాధ శవాలు లాగా వదిలేస్తున్నారు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో గంగానదిలో ఈ తరహాలోనే అనేక అనాధ శవాలు పైకి తేలటం తో ఉత్తర ప్రదేశ్ మరియు బీహార్ రాష్ట్ర ప్రభుత్వాలు విచారణ చేయడానికి రెడీ అయ్యాయి. అయితే ఆ పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాకుండా జగన్ ప్రభుత్వం కరోనా తో మృతి చెందిన వారి అంతిమ సంస్కారాలకు ప్రభుత్వమే 15 వేల రూపాయలు చెల్లించాలని ఆలోచన చేసినట్లు .. ఇప్పటికే వీటికి సంబంధించి ఆదేశాలు జిల్లా అధికారులకు జారీ చేసినట్లు ప్రభుత్వ వర్గాలలో వినపడుతున్న టాక్.
ఈ విషయం సోషల్ మీడియాలో రావటంతో చాలా మంది నెటిజన్లు జగన్ తీసుకున్న నిర్ణయాన్ని పొగుడుతున్నారు. కష్టకాలంలో గెలిచిన ప్రజలకు సరైన రీతిలో పరిపాలన అందిస్తున్నాడు, కరోనా ని ఆరోగ్య శ్రీ లో చేర్చడంలో గాని .., సకాలంలో కరోనా రోగులకు బెడ్ దొరికే విషయంలోగానీ జగన్ అద్భుతమైన నిర్ణయాలు తీసుకుంటున్నారని .. ఆయన పాలన పై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. కష్టకాలంలో కూడా ప్రజలకు సంక్షేమం అందిస్తూ మరోపక్క వారి ప్రాణాలను కాపాడటం నిజంగా గ్రేట్ అని మరికొంతమంది అభినందిస్తున్నారు.