తెలంగాణ రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాల కారణంగా రాజకీయ నేతలు ప్రజలను పలకరిస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా అధికార పార్టీకి చెందిన నాయకులు చాలావరకు ప్రజలమధ్య ఉంటూ ధైర్యం చెబుతూ వస్తున్నారు. ఇలాంటి తరుణంలో తెలంగాణ మహిళా మంత్రి సబితా ఇంద్రారెడ్డికి వరద బాధితులను పలకరించడం కోసం వెళ్లిన సమయంలో చేదు అనుభవం ఎదురయింది. కారణం చూస్తే భారీ వర్షాల వల్ల నష్టపోయిన బాధితులను ఆదుకునే విషయంలో పక్షపాతంగా ప్రభుత్వం వ్యవహరిస్తుందని ప్రజలు మండిపడుతున్నారు అట.
బాధితులకు నష్ట పరిహారం చెల్లించే విషయంలో ప్రభుత్వం అందిస్తున్న నష్టపరిహారం కేవలం టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు మాత్రమే చెల్లుతుందని బాధితుల ఆరోపణ. దీంతో పరామర్శించడానికి వచ్చిన సబితా ఇంద్రా రెడ్డిని స్థానికులు అడ్డుకున్నారు అట. ఈ విషయంలో నచ్చచెప్పాలని సబితా ఇంద్రారెడ్డి ప్రయత్నించినా గాని స్థానికులు వినకుండా ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూనే ఉన్నారు అంట.
దీంతో పరిస్థితి ఉన్నా కొద్దీ కఠినంగా మారే అవకాశం ఉండటంతో వెంటనే సబితా ఇంద్రారెడ్డి చేసేదేమీ లేక… నష్టపరిహారం చెక్కులను పంపిణీ చేయటానికి వచ్చిన ఆమె ఆ కార్యక్రమాలను పక్కనపెట్టి తిరిగి వెనక్కి వెళ్లిపోయారట. చాలా చోట్ల ఈ విధంగానే తెలంగాణ రాష్ట్రంలో వరద బాధితుల విషయంలో టీఆర్ఎస్ ప్రభుత్వ నాయకులు పక్షపాత ధోరణి లో వ్యవహరిస్తున్నట్లు టాక్ వస్తుంది. హైదరాబాద్ అదేవిధంగా మిగతా పరిసర ప్రాంతాల్లో కూడా టిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులకు పబ్లిక్ నుండి వ్యతిరేకత వస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.