హిందువులు ఎప్పటినుండో ఎదురుచూస్తున్న కల నెరవేరింది. చారిత్రాత్మకమైన అద్భుతమైన ఘట్టం అయోధ్య సాక్షిగా రామ మందిరానికి ప్రధాని మోడీ భూమి పూజ చేసి భారతీయ చరిత్రలో కొత్త పేజీలు కు ఆవిష్కృతం పలికారు. అయోధ్యలో రామమందిర నిర్మాణానికి మోడీ శంకుస్థాపన చేయడంతో దేశవ్యాప్తంగా శ్రీరాముని నామస్మరణ మారుమ్రోగింది. జరిగిన ఈ చారిత్రాత్మకమైన కార్యక్రమంలో ఆసక్తికరమైన సన్నివేశం చోటు చేసుకుంది. భూమి పూజ అనంతరం జరిగిన సభలో వేదికపై విచ్చేసి అతిథులందరికీ మోడీ తన మార్క్ కనబడేలా సాష్టాంగ నమస్కారం చేయటం ఈ కార్యక్రమానికి హైలెట్ అయ్యింది.
కార్యక్రమం మొత్తం అంతా తానై వ్యవహరించి దేశ ప్రజల దృష్టిలో హిందుత్వానికి ఐకాన్ గా మోడీ అన్నట్టు వ్యవహరించారు. హిందువుల సంకల్పం నెరవేరింది, ఎంతోమంది ప్రార్థనలు ఫలించాయి అంటూ మోడీ అయోధ్య రామ మందిరం లో “వన్ మాన్ ఆర్మీ” గా అంతా తానై వ్యవహరించారు. నరుడు నారాయణుడు ఒకటైన సమయం ఇది అంటూ మోడీ తన ప్రసంగంతో ఆకట్టుకున్నారు.
అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి శంకుస్థాపన జరగటంతో దేశవ్యాప్తంగా రామనామ స్మరణ మారుమ్రోగింది. మహమ్మారి కరోనా వైరస్ కారణంగా కేవలం 175 మంది అతిధుల సమక్షంలో ఈ కార్యక్రమం జరగగా మోడీ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారు. అయోధ్యలో ఎప్పుడైతే రామమందిర శంకుస్థాపనకు నరేంద్ర మోడీ పునాది రాయి వేశారో, దేశవ్యాప్తంగా తో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులు శ్రీరామ్ నామస్మరణ తో పాటు నరేంద్ర మోడీ పేరును కూడా హైలైట్ చేస్తూ రామమందిర శంకుస్థాపన కార్యక్రమానికి సంతోషం వ్యక్తం చేస్తున్నారు.