ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ హైదరాబాద్ పర్యటన వాయిదా పడింది. తెలుగు రాష్ట్రాల్లో పరుగులు తీసేందుకు సిద్దమైన వందేభారత్ ఎక్స్ ప్రెస్ ట్రైన్ ను ఈ నెల 19వ తేదీన ప్రధాన మంత్రి నరేంద్ర ప్రారంభిస్తారని ముందుగా షెడ్యుల్ ఖరారు అయ్యింది. తెలంగాణ పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ .. రూ.7076 కోట్ల విలువైన పలు ప్రాజెక్టులకు ప్రారంభించేందకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇదే క్రమంలో పెరెడ్ గ్రౌండ్ లో బహిరంగ సభ నిర్వహణకు పార్టీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించనున్న వందే భారత్ ఎక్స్ ప్రెస్ సికింద్రాబాద్ నుండి విజయవాడ వరకూ తిరగనుంది. ఈ ట్రైన్ కోసం ప్రయాణీకులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. మోడీ పర్యటన నేపథ్యంలో ఇప్పటికే బీజేపీ నేతలు, అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే 19వ తేదీన ప్రధాని మోడీ తెలంగాణ పర్యటన వాయిదా పడింది. అనివార్య కారణాల వల్ల పీఎం మోడీ తెలంగాణ పర్యటన వాయిదా పడినట్లుగా తెలుస్తొంది.