Golden Globe Award’s: “RRR” హవా ప్రపంచవ్యాప్తంగా ఇంకా కొనసాగుతోంది. గత ఏడాది కలెక్షన్లు సాధిస్తే.. కొద్ది నెలల నుండి ఇంటర్నేషనల్ అవార్డ్స్ సొంతం చేసుకుంటూ ఉంది. ఇప్పటికే మూడు ఇంటర్నేషనల్ అవార్డు సొంతం చేసుకున్న ఈ సినిమా లేటెస్ట్ గా ప్రపంచ ప్రతిష్టాత్మక సినిమా అవార్డులలో ఒకటి గోల్డెన్ గ్లోబ్ అవార్డు గెలుచుకోవడం జరిగింది. ఈ సినిమాలో “నాటు నాటు” సాంగ్ కి గాను…కీరవాణి అంతర్జాతీయ వేదికపై అవార్డు అందుకున్నారు. దీంతో సినిమా ఇండస్ట్రీ నుండి ఇప్పటికే ఏఆర్ రెహమాన్, మెగాస్టార్ చిరంజీవి అభినందనలు తెలియజేయగా.
తాజాగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు “RRR” సినిమా బృందాన్ని అభినందించారు. సినిమాలోని పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు రావడం ప్రతి భారతీయుడికి గర్వకారణం అని అన్నారు. కీరవాణి కీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఇదే సమయంలో మహేష్ బాబు సైతం సినిమా బృందానికి అభినందనలు తెలియజేయడం జరిగింది. దర్శకుడు రాజమౌళి స్పందించి…”మాటలు రావడం లేదు, సంగీతానికి హద్దులు లేవు. నాకు నాటునాటు ఇచ్చినందుకు అభినందనలు, ధన్యవాదాలు పెద్దన్న. ఇది ఎంతో ప్రత్యేకమైనది. విడుదలైనప్పటినుండి ఈ పాటను వింటూ స్టెప్పులేసిన ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి అభిమానికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను అని జక్కన్న కామెంట్ చేశారు. రచయిత చంద్రబోస్ కూడా స్పందించారు.
“నా జీవితంలో మరుపురాని మర్చిపోని మధుర క్షణాలివి. ‘నాటు నాటు సాంగ్ విశ్వ వేదిక మీద విజయం సాధించింది. రచయితగా చాలా సంతోషంగా, గర్వంగా ఉంది. 28 సంవత్సరాలలో 850 సినిమాలకు 3600 పైగా పాటలు రాశాను. మరి 3600 సార్లు తపస్సు చేస్తే ఒక్కసారైనా దేవుడు ప్రత్యక్షమవుతాడు కదా. ఇప్పుడు ఈ పాటకి ప్రత్యక్షమయ్యాడు అని ఓ వీడియో ద్వారా తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇక తారక్…” నా కెరియర్ లో ఎన్నో పాటలకు డ్యాన్స్ వేసా. నాటు నాటు నాకు ఎప్పటికీ ప్రత్యేకమే.. “అని తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. రామ్ గోపాల్ వర్మ, నాగార్జున, రవితేజ, అజయ్ దేవగన్ సహా పలువు సినీ ప్రముఖులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సైతం గోల్డెన్ గ్లోబ్ అవార్డు RRR కి రావటం పట్ల సినిమా యూనిట్ నీ అభినందించారు.