అమరావతి: తిరుమల తిరుపతి దేవస్థానం వారి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ (ఎస్విబిసి) చైర్మన్గా ప్రముఖ హస్యనటుడు పుధ్వి నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం నేడు ఉత్తర్వులు జారీ చేసింది.
పృధ్వి వైసిపి స్టేట్ సెక్రటరీగా సేవలు అందించడంతో పాటు జగన్తో పాటు పాదయాత్రలోనూ పాల్గొన్నారు.
ఇటీవలి కాలం వరకూ ప్రముఖ దర్శకుడు కె రాఘవేంద్రరావు ఈ పదవిలో కొనసాగారు. ఆరోగ్య కారణాల వల్ల ఇటీవల ఆయన రాజీనామా చేశారు.
ఎస్విబిసి చైర్మన్గా నియమించిన సందర్భంగా పృధ్వి శనివారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డిని కలిసి ధన్యవాదాలు తెలియజేశారు.