Siddhu: మరి కొద్ది నెలల్లో పంజాబ్ రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్కడ ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ నాయకుడు అమరేందర్ సింగ్ -సిద్దు కి మధ్య విభేదాలు ఉన్న క్రమంలో కాంగ్రెస్ హైకమాండ్ ఇటీవల ఇద్దరిని ఢిల్లీ పిలిచి మాట్లాడటం తెలిసిందే. అయితే మాట్లాడిన కొద్దిరోజులకు పంజాబ్ పీసీసీ చీఫ్ పదవి సిద్దూకి తాజాగా కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటించడం పంజాబ్ కాంగ్రెస్ పార్టీ లో సంచలనం రేపింది. విషయంలోకి వెళితే పంజాబ్ ముఖ్యమంత్రి అమరేందర్ సింగ్.. మొదటి నుండి సిద్ధుని వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే.
అయినా గాని అమరేందర్ సింగ్ వాదనను పక్కనపెట్టి సిద్దూకి తాజాగా పదవి అప్పజెప్పడం పంజాబ్ కాంగ్రెస్ లో కలకలం రేపుతోంది. ఎంపీలు, సీఎం మాట కాదని సిద్ధూ కీలక పదవుల్లో కాంగ్రెస్ అప్పజెప్పడం పంజాబ్ రాష్ట్ర రాజకీయాలలో చర్చనీయాంశంగా మారింది. ఎప్పటినుండో పంజాబ్ కాంగ్రెస్ పార్టీలో సంక్షోభం నెలకొన్న నేపథ్యంలో కాంగ్రెస్ హైకమాండ్ తాజాగా తీసుకున్న నిర్ణయం కాంగ్రెస్ వర్గాల్లో కూడా హాట్ టాపిక్ అయింది.
Read More: congress: తెలంగాణ కాంగ్రెస్ ఢిల్లీలో ఓ కామెడీ
సరిగ్గా పంజాబీ ఎన్నికలకు ఆరు నెలల ముందు పంజాబ్ పీసీసీ చీఫ్ గా సిద్ధూ కి కీలక బాధ్యతలు అప్పజెప్పడం మాత్రమే కాకుండా ప్రచార బాధ్యతలు కూడా సిద్ధూ కి అప్పజెప్పడం విశేషం. చాలా వరకు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ నాయకులు.. ఢిల్లీలో జరిగిన సిద్ధూ -అమరేందర్ సింగ్ లతో భేటీ లో కాంగ్రెస్ హైకమాండ్ సిద్ధూ కి మొగ్గు చూపడంతో పంజాబ్ పొలిటికల్ వాతావరణం సరికొత్తగా మారింది.