చంద్వార(మధ్యప్రదేశ్): సభల్లో అనర్గళంగా ఉపన్యాసం చేసే ప్రముఖ సినీనటుడు, మాజీ కేంద్రమంత్రి శత్రుఘ్న సిన్హా ఎన్నికల ప్రచారసభలో నోరు జారారు. తరువాత సవరించుకోవాల్సి వచ్చింది.
బిజెపిపై తీవ్ర విమర్శలు చేసి ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరిన శత్రుఘ్న సిన్హా కాంగ్రెస్ పార్టీని ప్రశంసల్లో ముంచెత్తే క్రమంలో ముస్లీం లీగ్ నేత మహమ్మద్ అలీ జిన్నాను కాంగ్రెస్ ప్యామిలీలో చేర్చారు.
మధ్యప్రదేశ్ లోని చంద్వారలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన ప్రసంగిస్తూ.. మహాత్మా గాంధీ నుంచి సర్దార్ పటేల్ వరకూ, మహమ్మద్ ఆలీ జిన్నా నుంచి జవహర్లాల్ నెహ్రూ వరకూ దేశాభివృద్ధిలో కీలకభూమిక పోషించారనీ, అందుకే తాను కాంగ్రెస్లో చేరానని పేర్కొన్నారు.
పాకిస్థాన్ వ్యవస్థాపకుడైన జిన్నాను కాంగ్రెస్ కుటుంబ సభ్యునిగా పేర్కొంటూ శత్రుఘ్నసిన్హా చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి.
ఈ కామెంట్లపై ప్రత్యర్థులు మండిపడుతున్న నేపథ్యంలో శనివారం శత్రుఘ్న సిన్హా వివరణ ఇచ్చారు.
తాను అనుకోకుండా నోరు జారాననీ, మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్కు బదులు మహమ్మద్ జిన్నా పేరును తప్పుగా ఉచ్చరించానని ఆయన వివరణ ఇచ్చారు.
#WATCH Shatrughan Sinha, Congress in Chhindwara, MP: Congress family from Mahatma Gandhi to Sardar Patel to Mohd Ali Jinnah to Jawaharlal Nehru…it's their party, they had the most important role in development & freedom of the country. This is the reason I've come here. (26.4) pic.twitter.com/HJg3EV8rNE
— ANI (@ANI) April 27, 2019