NewsOrbit
రాజ‌కీయాలు

జనసేనలోకి ఎస్‌పివై కుటుంబం?

కర్నూలు, మార్చి 20:  నంద్యాల పార్లమెంట్ సభ్యుడు ఎస్‌పివై రెడ్డి కుటుంబం జనసేన పార్టీలో చేరుతున్నట్లు సమాచారం. జనసేన పార్టీ తరపున ఎస్‌పివై రెడ్డి ఎంపి అభ్యర్థిగా ఆయన కోడలు శైలజ ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

తెలుగుదేశం పార్టీ ఆయన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయకపోవడంతో ఎస్‌పివై రెడ్డి తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తామని కూడా ప్రకటించారు. తమ కుటుంబం తెలుగుదేశం పార్టీని వీడుతున్నట్లు కూడా తెలియజేశారు.

మూడు పర్యాయాలు వరుసగా నంద్యాల పార్లమెంట్‌ నుండి గెలిచి వివాదరహితుడుగా, నిజాయితీపరుడుగా పేరున్న ఎస్‌పివై రెడ్డి జనసేన పార్టీలో చేరితే జిల్లాలో పార్టీకి లాభిస్తుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్, సీనియర్ నేత నాదెండ్ల మనోహర్‌లు భావించి జిల్లా నాయకుల ద్వారా పార్టీలోకి రావాలని కోరినట్లు తెలిసింది.

ఇప్పటికే కార్యకర్తలు కూడా జనసేన తరపున పోటీ చేయాలని ఎస్‌పివై రెడ్డిపై ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తోంది. జనసేన పార్టీ కూడా పార్లమెంట్ అభ్యర్థిత్వం ఖరారు చేయడానికి సుముఖంగా ఉండటంతో నేడో రేపో ఎస్‌పివై రెడ్డి కుటుంబం జనసేన పార్టీలో చేరుతున్నారని ఆ పార్టీ వర్గాలు ద్వారా తెలిసింది.

2014లో వైసిపి తరుపున ఎంపిగా విజయం సాధించిన ఎస్‌పివై రెడ్డి అనంతరం తెలుగుదేశం పార్టీలో చేరారు.

Related posts

 Election 2024: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన పోలింగ్ సమయం

sharma somaraju

Video Viral: పోలింగ్ కేంద్రం వద్ద ఓటరు చెంప చెళ్లు మనిపించిన ఎమ్మెల్యే .. తిరిగి అదే రీతిలో ఎమ్మెల్యేపై .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

పోలింగ్ డే ట్విస్ట్‌: వైసీపీకి మంత్రి బొత్స సత్యనారాయణ రాజీనామా.. ?

ఏపీ పోలింగ్ రోజు వైసీపీకి ఇన్‌డైరెక్టుగా మ‌ద్ద‌తు ఇచ్చేసిన జూనియ‌ర్ ఎన్టీఆర్ ?

ప్రశాంత్ కిషోర్ సర్వే…. జగన్‌కు ఎన్ని సీట్లు అంటే.. ?

ఏంద‌య్యా ఇది…BRSకు మెజారిటీ సీట్లు… ప్రధానిగా కేసీఆర్… ?

పోలింగ్ ముందు రోజు పిఠాపురం వైసీపీలో ర‌చ్చ రచ్చ‌.. చేతులెత్తేసిన వంగా గీత‌..?

పవన్ కళ్యాణ్‌ను ఓడించేందుకు జగన్ కొత్త స్కెచ్.. రివీల్ అయ్యిందిగా..?

ఏపీ బీజేపీ ఆశ‌ల‌న్నీ వీళ్ల‌పైనే.. ఏం చేస్తారో…?

ఏపీలో ఈ జిల్లాలే డిసైడింగ్ ఫ్యాక్ట‌ర్‌.. ఇక్క‌డి జ‌నాలు తిన్న‌ది మ‌రిచిపోరు…!

PM Modi: రికార్డు స్థాయిలో ప్రజలు పోలింగ్ లో పాల్గొనాలి .. మోడీ

sharma somaraju

General Elections: కొనసాగుతున్న పోలింగ్ .. కేంద్రాల వద్ద బారులు తీరిన ఓటర్లు

sharma somaraju

Arvind Kejriwal: దేశంలో అధికారంలోకి వచ్చేది ఇండియా కూటమి ప్రభుత్వమే .. అరవింద్ కేజ్రీవాల్

sharma somaraju

AP Elections 2024: వైసీపీ అభ్యర్ధి వంగా గీత కార్యాలయాన్ని ముట్టడించిన ఓటర్లు .. ఎందుకో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే..!

sharma somaraju

ఆ మూడు రిజ‌న్లు… చింత‌మ‌నేని గెలుపును నిర్ణ‌యిస్తున్నాయా..?

Leave a Comment