అమరావతి, జనవరి 23: ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పాత స్నేహాన్ని పునరుర్ధరించుకునేందుకు తెలుగుదేశం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది.
తాజాగా జనసేన, టిడిపిల మధ్య పెద్దగా విభేదాలు లేవని రాజ్యసభ సభ్యుడు టిజి వెంకటేశ్ చేసిన ప్రకటన మళ్ళీ రెండు పార్టీల మధ్య సయోధ్య నెలకొంటుందన్న చర్చకు ఆస్కార మేర్పడింది.
ఉత్తర్ప్రదేశ్లో బహుజన సమాజ్ పార్టీ, సమాజ్ వాదీ పార్టీలు కలిసినప్పుడు తిరిగి మీము కలిస్తే తప్పేంటనేది వెంకటేశ్ వాదన. సిఎం కుర్చీపై ఆసక్తిలేదని పవన్ అనేక సార్లు ప్రస్తావించారంటూ టిజి పాత సంగతిని గుర్తుచేశారు. కేంద్రం పై పోరాటంలోనే రెండు పార్టీల మధ్య అభిప్రాయ భేదాలు ఉన్నాయని ఆయన అమరావతిలో బుధవారం మీడియాకు తెలిపారు.
2014 ఎన్నికల్లో తెలుగుదేశం, భారతీయ జనతాపార్టీలు కలసి పోటీచేయగా జనసేన మద్దతు ప్రకటించింది.
గత ఏడాది ప్రత్యేక హోదా అంశంపై యూ టర్న్ తీసుకున్న టిడిపి బిజెపితో బంధాన్ని తెంచుకుంది.
రాష్ట్రంలో సొంతంగా పోటీచేయాలని నిర్ణయానికి వచ్చిన జనసేన వామపక్షపార్టీలతో కలసి పనిచేస్తామని చెప్పి అధికార టిడిపికి దూరం జరిగింది.
ముఖ్యమంత్రి చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్లో పవన్పై వ్యక్తిగత విమర్శలకు దిగవద్దని పార్టీనేతలకు సూచించారు.