లాక్ డౌన్ సమయంలో మే ఆరు తర్వాత తెలంగాణ ప్రభుత్వం మద్యం దుకాణాలను ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే ఓపెన్ చేయాలని అనుమతి ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే. లాక్ డౌన్ నేపథ్యంలో మద్యం దుకాణాల విషయంలో అప్పట్లో చాలా కఠినంగా వ్యవహరించింది తెలంగాణ ప్రభుత్వం.
అటువంటిది తాజాగా గతంలో మాదిరిగా కాకుండా పూర్తిగా ఆంక్షలు ఎత్తివేసే రీతిలో ఉదయం 10 గంటల నుండి రాత్రి పొద్దుపోయే వరకు అనగా రాత్రి 11 గంటల వరకు తాగొచ్చు అనే విధంగా మద్యం షాపులు ఓపెన్ చేసుకోవచ్చు అంటూ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.కరోనా కారణంగా లాక్డౌన్ నేపథ్యంలో స్టార్టింగ్ లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంపూర్ణ లాక్డౌన్ విధించిన సమయంలో రాష్ట్రంలో మద్యం అమ్మకాలపై పూర్తిస్థాయి నిషేధం విధించారు.
ఆ తర్వాత లాక్ డౌన్ సడలింపు లో భాగంగా కొంత సమయాన్ని అనుమతి ఇస్తూ మద్యం అమ్మకాలు జరిపేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కొంతకాలానికి వైన్ షాపులు ఓపెన్ చేసుకోవచ్చు అంటూ…మద్యం దుకాణాలు తెరచి ఉంచే టైం స్వల్పంగా పెంచుతూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది.
తాజాగా తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో రాష్ట్రంలో మద్యం దుకాణాల పై ఉన్న ఆంక్షలు మొత్తం ప్రభుత్వం ఎత్తివేసినట్లు అయ్యింది. దీంతో తెలంగాణలో మందుబాబులు ప్రభుత్వ నిర్ణయంపై సంబరాలు చేసుకుంటున్నారు.