తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు సీఎం కేసీఆర్ కూతురు మాజీ ఎంపీ కవిత సరికొత్త రికార్డ్ క్రియేట్ చేశారు. ట్విట్టర్ లో వన్ మిలియన్ ఫాలోవర్స్ ల మైలురాయిని చేరుకున్నారు. సౌత్ ఇండియాలో ఈ ఘనత సాధించిన ఏకైక మహిళా నేతగా కవిత నిలిచారు. సామాజిక, రాజకీయ వర్తమాన అంశాలపై ట్విటర్ లో కవిత తన అభిప్రాయాలను షేర్ చేస్తూ సమస్యలపై స్పందిస్తూ టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అభిమానులకు మరింత చేరువ అవుతున్నారు.
తెలంగాణ జాగృతి ద్వారా ప్రజాక్షేత్రంలో అడుగుపెట్టి బతుకమ్మ పండుగను విశ్వవ్యాప్తం చేసిన కవిత టిఆర్ఎస్ పార్టీలో కీలక నాయకురాలిగా రాణిస్తుంది. తెలంగాణ ఉద్యమంలో మహిళ గొంతును వినిపించిన నాయకురాలిగా ప్రత్యక్ష ఎన్నికలలో గెలిచి తక్కువ సమయంలోనే ఉత్తమ పార్లమెంటేరియన్ గా ఘనత సాధించిన నేత కల్వకుంట్ల కవిత. గతంలో నిజామాబాద్ పార్లమెంట్ కి ప్రాతినిధ్యం వహించిన కవిత అనేక విషయాలలో తనదైన శైలిలో పోరాడి…పార్లమెంట్ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు.
కాగా 2019 సార్వత్రిక ఎన్నికలలో పోటీ చేసి ఓడిపోయిన కవిత ప్రస్తుతం పార్టీలో కీలక నాయకురాలిగా రాణిస్తోంది. ఇటువంటి తరుణంలో సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ అనేక సమస్యలపై స్పందించే కవితకి వన్ మిలియన్ ఫాలోవర్స్ సంఖ్య రావటంతో టిఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. ఇలాంటి రికార్డ్ సౌత్ ఇండియా పొలిటిషియన్ మహిళా నేతలలో ఎవరు సాధించలేదు. ఈ పరిణామంతో కల్వకుంట్ల కవిత పేరు సోషల్ మీడియాలో ఎలక్ట్రానిక్ మీడియాలో మారుమ్రోగుతోంది.