అసాధ్యమనుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి చరిత్ర సృష్టించారు కేసీఆర్. తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపించి సరైన సమయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటూ 2014 ఎన్నికలకు ముందు ప్రత్యేక తెలంగాణ ను సాధించిన కేసీఆర్ ఆ సమయంలో జరిగిన ఎన్నికలలో ముఖ్యమంత్రిగా గెలిచి తెలంగాణకి మొట్టమొదటి ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తరువాత ముందస్తు ఎన్నికలకు వెళ్లి భారీ మెజార్టీతో రెండోసారి అధికారంలోకి వచ్చారు. ఇటువంటి తరుణంలో రెండోసారి కేసీఆర్ గెలిచాక, చాలా వరకు టిఆర్ఎస్ పార్టీలో కేసిఆర్ దృష్టి జాతీయ రాజకీయాలపై పడిందని, ఆయన ప్లేసులో ఆయన తనయుడు కేటీఆర్ సీఎంగా అవుతున్నట్లు వార్తలు స్టార్ట్ అయ్యాయి.
2019 ఎన్నికల సమయంలోనే ఫెడరల్ ఫ్రంట్ అంటూ కేసిఆర్ అప్పట్లో హడావిడి చేయడం జరిగింది. సరిగ్గా ఎన్నికలకు ముందు ఆ ఆలోచన నుండి పక్కకు వచ్చేసారు. కానీ ఇటీవల మాత్రం… దేశంలోనే అన్ని జాతీయ రాజకీయ పార్టీలను ఏకం చేయడానికి కేసిఆర్ గ్రౌండ్ లెవెల్ లో వర్క్ స్టార్ట్ చేస్తున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో నేషనల్ స్థాయిలో రాణించడానికి మోడీ సర్కార్ ఢీ కొట్టడానికి పార్లమెంటులో ప్రవేశ పెట్టబోతున్న కొత్త విద్యుత్ చట్టాన్ని పావుగా వాడుకొని వ్యతిరేకించడానికి కేసీఆర్ రెడీ అవుతున్నారట. కొత్త విద్యుత్ చట్టాన్ని జాతీయస్థాయిలో ఉద్యమంగా కేసీఆర్ మలచుకుని మోడీతో కయ్యానికి రెడీ అవుతున్నట్లు సమాచారం.
కరోనా వైరస్ విషయంలో ఇంకా చాలా సందర్భాలలో కేంద్రం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ కొన్ని విమర్శలు చేయడంతో కేసిఆర్ జాతీయ స్థాయి రాజకీయాల్లో ఎంటర్ అయ్యి మోడీ సర్కార్ కి చెక్ పెట్టబోతున్నట్లు టాక్. ముఖ్యంగా ఈ విద్యుత్ చట్టం వల్ల దేశంలో ఉన్న రాష్ట్రాలకు విద్యుత్ వ్యవస్థ పై పూర్తిగా అధికారం పోతుందని, అంతేకాకుండా కొత్త చట్టం తో విద్యుత్ రంగంలో చాలావరకు ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి ఉంటుందని ఇప్పటికే చాలా మంది అంటున్నారు. దీంతో ఇది ఒక ఉద్యమంగా మలచుకుని కేసీఆర్ స్ట్రాటజీ గా నేషనల్ స్థాయిలో పాలిటిక్స్ లో రాణించడానికి రెడీ అవుతున్నారట. ఈ నేపథ్యంలో కేసీఆర్ విద్యుత్ వ్యూహం హిట్ అవుతుందా లేకపోతే ఫ్లాప్ అవుతుందా అన్నది ఇప్పుడు పెద్ద సస్పెన్స్ గా మారింది.