అమరావతి, మార్చి 16: వైసిపి అభ్యర్థుల ప్రకటన మళ్లీ వాయిదా పడింది. శనివారం సాయంత్రం పార్టీ అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి తొలి జాబితా విడుదల చేస్తారని భావించారు.
ఆదివారం ఉదయం ఇడుపులపాయలో పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ అభ్యర్థుల పేర్లను ప్రకటించనున్నారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.
ఇప్పటికే మొదటి జాబితాలో మెజారిటీ అభ్యర్ధుల లిస్టు ఫైనల్ అయినప్పటికీ అధికారికంగా వెల్లడించలేదు. అయితే ఆయా అభ్యర్థులను ఎన్నికల ప్రచారంలో నిమగ్నమవ్వాలని సూచించారు.
ఆదివారం ఉదయం అభ్యర్థుల ప్రకటనతో పాటు పార్టీ మేనిఫెస్టో కూడా ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.
అనంతరం ఇడుపులపాయ నుంచి హెలికాప్టర్లో బయలుదేరి విశాఖపట్నం చేరుకుంటారు. అక్కడి నుంచి జగన్ నెల్లిమర్ల, నర్సీపట్నం, పి గన్నవరం ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారసభలో పాల్లొంటారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.