ఏపీలో స్థానిక ఎన్నికల కి సంబంధించిన విషయం ఏపీ ఎలక్షన్ కమిషన్ వర్సెస్ ఏపీ ప్రభుత్వం అన్నట్టుగా ఉంది. మార్చి నెలలో ఎన్నికలు జరగాల్సిన క్రమంలో…ఒక్క పాజిటివ్ కేసు కూడా అప్పుడు రాష్ట్రంలో లేని టైంలో కరోనా ఎఫెక్ట్ అంటూ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికలను వాయిదా వేయడం అందరికీ తెలిసిందే. కాగా ప్రస్తుతం భారీ స్థాయిలో రాష్ట్రంలో కేసులు నమోదవుతున్న తరుణంలో… స్థానిక ఎన్నికలు జరిగేలాగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ అత్యుత్సాహం చూపించడం ఏపీ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారి తీసింది. టీడీపీ డైరెక్షన్లో నిమ్మగడ్డ మళ్లీ పొలిటికల్ గేమ్ స్టార్ట్ చేసినట్టు వైసిపి వర్గాలు వెల్లడిస్తున్నాయి. .
కరోనా ప్రభావం కొనసాగుతూనే ఉన్న ఇలాంటి తరుణంలో ఎన్నికలు ఎలా జరిపిస్తారు అని ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయాన్ని ప్రశ్నిస్తోంది ఏపీ ప్రభుత్వం. కానీ మరోపక్క ఈ ఎన్నికలకు సంబంధించి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అన్న దానిపై రాష్ట్రంలో గుర్తింపు పొందిన పార్టీలన్నిటికీ నిమ్మగడ్డ ఆహ్వానం పంపడం ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది.
ఈరోజు ఉదయం పదిన్నర గంటలకు జరగనున్న ఎస్ఈసి సమావేశానికి ఒక్కో పార్టీ నుంచి ఒక ప్రతినిధి రావాలని ఈసీ సూచించారు. ఈ క్రమంలో ఇప్పటికే టిడిపి పార్టీ తరపున అధ్యక్షుడు అచ్చం నాయుడు హాజరు కానున్నట్లు ఆ పార్టీ వర్గాలు ప్రకటించాయి. మిగిలిన పార్టీ ప్రజా ప్రతినిధులు వస్తారన్న ప్రచారం మరోపక్క జరుగుతోంది. కానీ ఈ సమావేశానికి అధికార పార్టీ వైసీపీ మాత్రం హాజరు కావడం లేదని ఆ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు స్పష్టం చేశారు.