NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

లోకేష్‌కు జ‌గ‌న్ భ‌లే ఆఫ‌ర్‌…కల‌లో కూడా జ‌ర‌గ‌నిది

ఏపీ ముఖ్య‌మంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వం చ‌ర్య‌పై రాజ‌కీయ వ‌ర్గాల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ జ‌రుగుతోంది. తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు, నారా లోకేష్ విష‌యంలో పోలీసుల చ‌ర్య హాట్ టాపిక్‌గా మారింది.

ఆయ‌న‌పై కోవిడ్ నిబంధ‌న‌ల ఉల్లంఘ‌న‌ల‌ను పేర్కొంటూ పోలీసు కేసు న‌మోదు అయింది. అయితే, ఈ విష‌యంలో జ‌గ‌న్ స‌ర్కారు తీరుపై తెలుగుదేశం విరుచుకుప‌డింది. ఇదే స‌మ‌యంలో జ‌గ‌న్ స‌ర్కారు నిర్ణ‌యంపై రాజ‌కీయ విమ‌ర్శ‌కులు కొత్త విశ్లేష‌ణ చేస్తున్నారు.

వైసీపీ నేత‌ల‌కే రూల్స్ వ‌ర్తిస్తాయా?

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ, రైతుల వెతలను తన గొంతుకతో వినిపించాడనే లోకేష్‌పై అక్రమ కేసులు పెట్టార‌ని ఆరోపించారు. కోవిడ్ నిబంధనలు, చట్టాలు అనేవి ప్రతిపక్ష పార్టీలకు మాత్రమే వర్తిస్తాయా? అధికార పార్టీకి వర్తించవా? అని అన్నారు. రాజప్రాసాదాల్లో, బంగ్లాల్లో కూర్చొనే ముఖ్యమంత్రి , మంత్రులకు నీళ్లలో మగ్గుతున్న రైతుల కష్టాలు ఎలా తెలుస్తాయని ఆయ‌న ప్ర‌శ్నించారు. రాష్ట్ర రైతాంగానికి భరోసా ఇచ్చేలా, అన్నదాతల సమస్యలను ప్రభుత్వానికి వినిపించేలా చెప్పినందుకే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, లోకేశ్ పై తప్పుడు కేసులు పెట్టించింద‌ని ఆరోపించారు. వైసీపీ ఎమ్మెల్యేలకు, మంత్రులకు వర్తించని కోవిడ్ నిబంధనలు లోకేశ్ కు మాత్రమే ఎలా వర్తిస్తాయో డీజీపీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రోజా అంబులెన్స్ నడిపినప్పుడు, ఉండవల్లి శ్రీదేవి, బియ్యపు మధుసూదన్ రెడ్డి ట్రాక్టర్ ర్యాలీలు నిర్వహించినప్పుడు పోలీసులు ఏం చేశారు?

లోకేష్‌పై అందుకే కేసులు

రైతులకు ఇస్తున్న ఉచిత విద్యుత్ పథకానికి జగన్మోహన్ రెడ్డి మంగళం పాడుతున్న విధానాన్ని లోకేశ్ ఎండగట్టినందునే ఆయనపై అక్రమ కేసులు పెట్టించారని నారా లోకేష్ అన్నారు. రాష్ట్ర మంత్రులు రైతులను ఉద్దేశించి మాట్లాడే బూతుల భాషను, మంత్రుల వ్యాఖ్యలను రైతులకు అర్థమయ్యేలా చెప్పడమే లోకేష్ చేసిన నేరమా అని నిమ్మల నిలదీశారు. పశ్చిమగోదావరి జిల్లాకు కేవలం రూ.కోటి40లక్షల ఇన్ పుట్ సబ్సిడీని మాత్రమే ప్రభుత్వం విడుదలచేసిందని, ఆ సొమ్ము మొత్తం కేవలం 2వేలఎకరాలకు మాత్రమే ఇవ్వడం జరిగిందన్నారు. 4లక్షల ఎకరాలకు ఇన్ పుట్ సబ్సిడీ రావాల్సి ఉండగా, ఒక జిల్లాకు కేవలం 2వేల ఎకరాలకు ఇవ్వడమేంటని నిమ్మల మండిపడ్డారు. అదే అంశంపై లోకేశ్ వైసీపీ ప్రభుత్వాన్ని రైతుల సమక్షంలో నిలదీశారన్నారు. కాగా, లోకేష్‌పై కేసు న‌మోదు ద్వారా జ‌గ‌న్ స‌ర్కారు త‌న‌ను తాను ఇర‌కాటంలో ప‌డేసుకుంద‌ని అంటున్నారు.

author avatar
sridhar

Related posts

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju