కరోనా వైరస్ కారణంగా లాక్డౌన్ దెబ్బకు చాలా రంగాలు నష్టపోయాయి. ఎక్కడ వ్యాపారం లేక పోవడంతో పాటు ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావడంతో ఎక్కడికక్కడ లావాదేవీలు ఆగిపోయాయి. కానీ ఇలాంటి తరుణంలో కూడా టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం లాభాలు సాధించారు. రాజకీయంగా ప్రస్తుత పరిస్థితుల్లో అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న చంద్రబాబు, బిజినెస్ మాన్ గా మాత్రం కరోనా కష్టకాలం లో విజయం సాధించారు.
అది ఎలా అంటే ప్రముఖ వ్యాపార దిగ్గజం రిలయన్స్ గ్రూపులో పెట్టుబడులు పెట్టి దాదాపు ఆరు వందల కోట్లు లాభాలు సాధించారు. పూర్తి విషయంలోకి వెళితే రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానికి చెందిన రిలయన్స్ గ్రూప్ ఫ్యూచర్ గ్రూప్ రిటైల్ వ్యాపారాన్ని కొనుగోలు చేయడంతో…. ఈ గ్రూపులో 3.65 శాతం వాటా కలిగిన చంద్రబాబుకు హెరిటేజ్ ఆరు వందల కోట్ల లాభాల పంట పండింది.
దీంతో ఆరు వందల కోట్ల మేటర్ లో చంద్రబాబుని టార్గెట్ చేస్తూ వైసిపి విమర్శల వర్షం యధావిధిగా స్టార్ట్ చేసింది. చంద్రబాబు ఏం చేసినా కూడా బిజినెస్ పరంగా ఎప్పుడు విమర్శలు చేస్తూ వచ్చే వైసీపీ ఈసారి కరోనా టైమ్ లో వచ్చిన లాభాలను కూడా టార్గెట్ చేస్తూ విమర్శల వర్షం కురిపిస్తోంది. గతంలోనూ వైసిపి ప్రతిపక్షంలో ఉన్న సమయంలో కూరగాయల రేట్లు హెరిటేజ్ లో ఒకలా ఉంటే బయట మార్కెట్లో ఒకలా ఉంటాయని విమర్శలు చేయడం తెలిసిందే. వైయస్ జగన్ పాదయాత్రలో, ఎన్నికల ప్రచారంలో కూడా చంద్రబాబు వ్యాపారాలకు సంబంధించి విమర్శనాత్మకమైన కామెంట్లు అప్పట్లో గట్టిగానే పేలాయి. ఇప్పుడు ఇదే రీతిలో కరోనా సమయంలో చంద్రబాబు సంస్థ లాభాలు సాధించడంతో మరోసారి అదే తరహాలో అధికార పార్టీ వైసిపి విమర్శలు చేయడం స్టార్ట్ చేయటం గమనార్హం.