వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి జగన్ ముఖ్యమంత్రి పదవి చేపట్టక ఎక్కడా కూడా రాష్ట్రంలో అవినీతి లేకుండా పై స్థాయి నుంచి కింది స్థాయి వరకు ప్రక్షాళన చేస్తానని జగన్ హామీ ఇవ్వటం జరిగింది. ఆ రీతిగానే ఏపీ సీఎం జగన్ అవినీతి విషయంలో చాలా కట్టుదిట్టంగా వ్యవహరిస్తున్నారు. కాగా జగన్ తీరు ఇలా ఉంటే… కొంత మంది వైసీపీ పార్టీ నాయకుల తీరు మరోలా ఉంది. పార్టీని అడ్డంపెట్టుకుని అధికారం ఉంది కదా అని చలామణి అవుతున్నట్లు, ఇటీవల ఓ రేర్ ఘటనా పార్టీలో బయటపడింది.
పూర్తి విషయంలోకి వెళ్తే విశాఖపట్టణానికి చెందిన వైసీపీ పార్టీ నాయకుడు కొయ్య ప్రసాద్ రెడ్డి విశాఖ కలెక్టరేట్ పేరును మరియు పార్టీ సీనియర్ నాయకుడు రాజ్యసభ సభ్యుడు ఎంపీ విజయసాయి రెడ్డి పేరును ఉపయోగించడట. ఈ విధంగా రాజధాని విశాఖలో భూ సెటిల్మెంట్స్ కి పాల్పడుతున్నట్లు విషయం బయటపడింది. అంతేకాకుండా పార్టీకి సంబంధించిన మరికొంతమంది సీనియర్ నాయకుల పేర్లు చెప్పి ల్యాండ్ డీల్స్ పేరుతో విశాఖ చుట్టూ పరకాల పరిసరాల ప్రాంతాలలో కూడా అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో వెంటనే కొయ్య ప్రసాద్ రెడ్డిని పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నట్లు వైసిపి కేంద్ర కార్యాలయం ప్రకటించింది.