పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఓ మంత్రి వ్యవహారం వైసీపీ పార్టీలో కీలకంగా మారినట్లు సమాచారం. పూర్తి విషయంలోకి వెళ్తే సదరు మంత్రిపై అనేకసార్లు ఫిర్యాదులు ఇసుక అక్రమ విషయంలో వచ్చాయట. అంతేకాకుండా పార్టీలో ఉన్న కొంతమంది రెబల్ క్యాండిడేట్లు కూడా ఈ మంత్రి పై ఆరోపణలు చేశారట. అయితే ఈ విషయంపై ఆ మంత్రిని అప్పట్లో సీఎం జగన్ తన ఆఫీస్ కి పిలిపించుకుని మరీ వార్నింగ్ ఇచ్చారట.
దీంతో తనపై ఫిర్యాదు చేసిన వారిని టార్గెట్ చేసుకుని జిల్లాలో గ్రూపు రాజకీయాలు చేస్తూ ఇతర మంత్రుల వ్యవహారంలో జోక్యం చేసుకుంటూ ఇటీవల మరీ రెచ్చిపోతున్నారట. ఇసుక అక్రమ విషయంలో వైఎస్ జగన్ వార్నింగ్ ఇచ్చిన గాని కొద్ది నెలలు సైలెంట్ అయిన ఇటీవల మరి చేతివాటం చూపిస్తున్నట్లు జగన్ దృష్టికి వెళ్లిందట. దీంతో సదరు సీనియర్ మంత్రి కదలికలపై జగన్ ఇంటిలిజెన్స్ తో నిఘా పెట్టినట్లు టాక్ వస్తోంది.
ఈ నేపథ్యంలో సదరు మంత్రి ఇమీడియట్ గా జాగ్రత్త పడకపోతే రెండున్నర సంవత్సరాలు గడవకముందే మంత్రి పదవికి ఉద్వాసన గ్యారెంటీ అనే టాక్ పార్టీలో వినబడుతోంది. మరోపక్క ఈ మంత్రి సరిగ్గా జగన్ పాదయాత్ర చేయకముందు పార్టీలో జాయిన్ అయ్యి ఎమ్మెల్యేగా గెలిచి అసలు మంత్రి కూడా అయ్యే అవకాశం లేని క్రమంలో కొంతమంది సిఫార్సుతో రికమండేషన్ తో మంత్రి పదవి సంపాదించారట. దీంతో ఏమైనా తేడా వస్తే మాత్రం మంత్రి విషయంలో జగన్ కీలక నిర్ణయం తీసుకోవడం గ్యారెంటీ అనే టాక్ పార్టీలో గట్టిగా వినపడుతోంది.