5G Network: భారత దేశంలో ప్రస్తుతం ఉన్న బ్రాడ్ బ్యాండ్, 4జీ సెల్యులర్ నెట్వర్క్ లు అన్ని కూడా వేగవంతం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి.. త్వరలోనే భారత్లో 5జీ నెట్వర్క్ అందుబాటులోకి రానున్న సంగతి అందరికీ తెలిసిందే.. అయితే దేశంలో 5జీ టెక్నాలజీ ట్రయల్ రన్ చేయడంపై కరోనా సెకండ్ వేవ్ ఉదృతంగా మారిందని పుకార్లు వినిపించాయి.. ఇందులో ఏ మాత్రం నిజం లేదని నిపుణులు ఈ వార్తలను ఖండించారు తాజాగా 5జీ టెక్నాలజీ ఆరోగ్యంపై దుష్ప్రభావం కలిగిస్తుందని సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి.. దీనిపై సివోఏఐ క్లారిటీ ఇచ్చింది..
సెల్యులర్ ఆపరేటర్ల అసోసియేషన్ ఆఫ్ ఇండియా సివోఏఐ 5జీ టెక్నాలజీ ఆరోగ్యంపై దుష్ప్రభావం కలిగిస్తుందనే వార్త అవాస్తవమని, తప్పుడు ప్రచారమని తేల్చి చెప్పింది. 5జీ టెక్నాలజీ చాలా సురక్షితమైనదని, దీనికి సంబంధించిన అన్ని ఆధారాలు బలంగా ఉన్నాయని తెలిపింది. ఈ టెక్నాలజీ ఆర్థిక రంగంతో పాటు సమాజానికి కూడా మేలు జరుగుతుందని తెలిపింది. దేశంలో టెలికాం రంగంలో విధించిన ఎలక్ట్రో మాగ్నెటిక్ రేడియేషన్ పరిమితి అంతర్జాతీయంగా ఆమోదించిన పరిమాణంలో పదో వంతు మాత్రమే ఉందని సివోఏఐ డైరెక్టర్ ఎస్పి కొచ్చర్ తెలిపారు.
నాలుగు సంవత్సరాల ముందు వరకు 3జి ఉండడమే గొప్ప అలాంటిది జియో 4జీ తీసుకువచ్చి డిజిటల్ ఇండియాగా మార్పు తెచ్చింది. దీంతో స్మార్ట్ ఫోన్ లేని మనిషి లేదంటే అతిశయోక్తి కాదు. అయితే ఇప్పుడు పరుగులు తీసే మనిషికి ఈ వేగం సరిపోలేదు అందుకే 5జీని తీసుకువస్తున్నారు. 5జీ రాకతో ఆర్థిక రంగం బలపడనుంది. ఇప్పటికే ప్రపంచంలోనే ఎత్తయిన హిమాలయ పర్వతాలపై 5జి సిగ్నల్ అందుబాటులోకి వచ్చింది. త్వరలోనే భారతదేశం అంతటా 5g నెట్వర్క్ అందుబాటులోకి రానుంది. దీని వల్ల ఆరోగ్యానికి ఎటువంటి ముప్పు లేదు.