CM KCR Review On Dalit Bandhu: కేసిఆర్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళిత బంధు పైలెట్ ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి కేసిఆర్ ప్రగతి భవన్ లో సమీక్ష నిర్వహిస్తున్నారు. ఇప్పటికే హూజూరాబాద్ నియోజకవర్గంలో పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేసిన ఈ పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా మరో నాలుగు మండలాల్లో అమలు చేస్తున్న నేపథ్యంలో సన్నాహక సమావేశం నిర్వహిస్తున్నారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని చింతకాని, సూర్యపేట జిల్లా తిరుమలగిరి, నాగర్ కర్నల్ జిల్లా చారగొండ, నిజామాబాద్ జిల్లా నిజాంసాగర్ మండలాల్లో పైలట్ ప్రాజెక్టు అమలుపై చర్చిస్తున్నారు. ఈ సమావేశానికి ఖమ్మం, నల్లగొండ, మహబూబ్ నగర్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలకు చెందిన మంత్రులు హజరుకాగా హూజూరాబాద్ అనుభవాలు, ఇతర అంశాలను దృష్టిలో ఉంచుకుని నాలుగు మండలాల్లో దళిత బంధు పైలెట్ ప్రాజెక్టు అమలుపై సమావేశంలో చర్చిస్తున్నారు.
CM KCR Review On Dalit Bandhu: పార్టీ అనుమతితో హజరైన సీఎల్పీ నేత బట్టి..
కాగా ఈ సమావేశానికి సీఎల్పీ నేత బట్టి విక్రమార్క పార్టీ అనుమతితో హజరైయ్యారు. ముందుగా బట్టి తన నివాసంలో సమావేశంలో చర్చించాల్సిన అంశాలపై పార్టీ సీనియర్ నేతలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మధు యాష్కీ, శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితరులతో చర్చించారు. తన నియోజకవర్గ పరిధిలోని మండలాన్ని దళిత బంధు పథకాన్ని పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించడంతో పాటు కేసిఆర్ నుండి ఆహ్వానం అందిన కారణంగా దీనిపై నేతలతో చర్చించి హజరైనట్లు బట్టి తెలిపారు. సమావేశంలో సీఎస్ సోమేశ్ కుమార్, మంత్రులు ప్రశాంత్ రెడ్డి, నిజంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యేలు గాదరి కిషోర్, జైపాల్ యాదవ్, గవ్వల బాలరాజు, హన్మంత్ షిండే, జడ్పీ చైర్మన్లు, కలెక్టర్లు పాల్గొన్నారు.